అమ్మవారికి చీర బదులు గౌను.. వివాదంలో బోడుప్పల్ నిమిషాంబికా ఆలయ పూజారి

Mana Enadu : దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు (Devi Navaratri Utsavalu) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఊరూ.. వాడా.. చిన్నా పెద్దా అంతా కలిసి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో కొలువుదీరిన దుర్గామాత (Goddess Durga) వైభవంగా పూజలందుకుంటున్నారు.  నియమ నిష్ఠలతో భక్తులు అమ్మవారిని పూజిస్తున్నారు. చాలా మంది ఈ నవరాత్రుల సమయంలో ఉపవాసం కూడా ఉంటున్నారు.

9 రోజుల్లో..9 రూపాల్లో అమ్మవారి దర్శనం

అశ్వియుజ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకు.. 9 రోజులపాటు 9 రూపాలలో మహాశక్తి స్వరూపిణిని కొలవడం ఆనవాయితీగా వస్తోంది. చెడుపై శక్తి సాధించిన విజయానికి గుర్తుగా పదో రోజున ‘విజయదశమి (Dussehra)’ పండుగని జరుపుకుంటున్నాం.  ఈ నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కోరోజు.. ఒక్కో అలంకారంలో.. ఒక్కో రంగు వస్త్రాలలో భక్తులకు దర్శమిస్తుంటారు. అలా హైదరాబాద్ లోని పలు ఆలయాల్లో అమ్మవారు కొలువై వివిధ అలంకారాల్లో భక్తులను కనువిందు చేస్తున్నారు.

దుర్గమ్మకు చీరకు బదులు గౌను

అయితే నగరంలోని బోడుప్పల్ నిమిషాంబికా దేవాలయం (boduppal nimishamba temple)లో మాత్రం అమ్మవారి అలంకారణ ఇప్పుడు వివాదానికి దారి తీసింది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని బాలా త్రిపుర సుందరీగా పూజారులు అలంకరించారు. అయితే పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారం, సంప్రదాయం ప్రకారం అమ్మవారిని చీరతో అలంకరిస్తుంటారు. కానీ ఇక్కడి అమ్మవారిని మాత్రం పూజారి గౌనులో అలంకరించడం ఇప్పుడు వివాదానికి దారి తీసింది.

పూజారి వివాదాస్పద వీడియో

అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు దుర్గమ్మ అలంకరణ చూసి షాకయ్యారు. చీర కాకుండా గౌను (Goddess Durga Frock)లో అమ్మను అలంకరించడంతో షాకై అలా ఎందుకు చేశారని పూజారని ప్రశ్నించారు. ఈ క్రమంలో పూజారి మహిళా భక్తులపై తీవ్రంగా మండిపడ్డారు. అంతే కాకుండా పరుష పదజాలం ఉపయోగిస్తూ వారితో వాగ్వాదానికి దిగారు.

 

పూజారిపై భక్తులు ఫైర్

ఈ క్రమంలోనే అమ్మవారు బాలాత్రిపుర సుందరీ అవతారంలో దర్శనమిస్తున్నారని అన్న పూజారి.. బట్టలేకుండా.. మీలా జుట్టు విరబోసుకుని లేరంటూ అసభ్య పదజాలం వాడుతూ ఓ మహిళపై తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పూజారి తీరుపై భక్తులు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు చేస్తున్నారు.

Related Posts

Parliament: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై కేంద్రం అనాసక్తి 

ఆపరేషన్ సింధూర్ తర్వాత పార్లమెంట్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశం నిర్వహించడానికి కేంద్రం అనాసక్తి చూపుతున్నట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి. రాబోయే…

West Indies cricket team: ఒలింపిక్స్ లో వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు అవకాశం ఛాన్స్ దక్కేనా? 

లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్ గేమ్స్‌లో వెస్టిండీస్ క్రికెట్ జట్టు తరఫున ఎవరు ప్రాతినిధ్యం వహించాలి అనే దానిపై క్రికెట్ వెస్టిండీస్ (CWI) ఐసీసీని స్పష్టత కోరుతోంది. సాధారణంగా, వెస్టిండీస్ క్రికెట్ లో 15 దేశాలు లేదా ప్రాంతాల సమాహారంగా ఉంటుంది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *