గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు ఉందా..? ఇలా చెక్ చేస్కోండి

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు (MLC Elections 2025) నగారా మోగిన విషయం తెలిసిందే. తెలంగాణలో మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి, ఏపీలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉమ్మడి తూ.గో., ప.గో జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 27వ తేదీ పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 3వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.

ఈ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే వేలాది మంది పట్టభద్రులు ఓటు (Graduate MLC Elections 2025) నమోదు చేసుకున్నారు. ఇటీవల అధికారులు ఓటర్ల జాబితాను కూడా రిలీజ్ చేశారు. పట్టభద్రుల ఓటర్ల జాబితా పార్లమెంట్, అసెంబ్లీ ఓటర్ల జాబితాతో ఏ మాత్రం సంబంధం లేకుండా ఉంటుందన్న విషయం తెలిసిందే. మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మీ ఓటు ఉందా లేదా? ఏ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేయాలి? వంటి విషయాలు ఇలా తెలుసుకోండి.

ఏపీ, తెలంగాణ ఎన్నికల వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయాలి. ఉదాహరణకు ఏపీ వెబ్ సైట్.. https:///ceoandhra.nic.in ఓపెన్ చేసి.. కుడివైపున ‘ఎమ్మెల్సీ రిజిస్ట్రేషన్‌ 2024’  క్లిక్‌ చేయగా నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి. ‘సెర్చ్‌ యువర్‌ నేమ్‌’ (Search your Name) క్లిక్‌ చేస్తే.. పట్టభద్రులు, టీచర్స్‌ ఎమ్మెల్సీలకు సంబంధించిన వివరాలతో పేజీ ఓపెన్ అవుతుంది. కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో. జిల్లాలకు చెందిన వారైతే ఆ జిల్లాలకు చెందిన ఆప్షన్ ఎంచుకోవాలి.

అనంతరం ఎమ్మెల్సీ ఓటు (MLC Vote 2025) నమోదు దరఖాస్తు చేసిన సమయంలో ఇచ్చిన ఐడీ నంబర్ ద్వారా ఓటు వివరాలు తెలుసుకోవచ్చు. లేదా మీ పేరు లేదా ఇంటి నంబరుతో ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇంటి నంబరును ఎంటర్ చేసి సబ్​మిట్ చేస్తే ఆ నంబరుతో ఎన్ని ఓట్లు ఉన్నాయి.. దరఖాస్తు నంబరుతో పాటు ఓటరు పేరు, వయసు, పోలింగ్‌ బూత్‌ నంబరు.. ఓటు సీరియల్‌ నంబరుతో పాటు ఏ పోలింగ్‌ కేంద్రంలో ఏ గదిలో మీరు ఓటు వేయాలో కూడా వివరాలు తెలుసుకోవచ్చు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *