ఏసీబీకి చిక్కిన అశ్వాపురం మండల వ్యవసాయ అధికారి

నిత్యం ఏదో చోటా పలువురు ప్రభుత్వ అధికారులు అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు చిక్కుతూనే ఉన్నారు. ఏసీబీ నిత్యం నిఘా పెడుతున్నా కొందరు తమ చేతివాటం చూపించడం మాత్రం మానేయడం లేదు. కొందరు అధికారుల నిఘాకు చిక్కుతుంటే.. మరికొందరు బాధితుల ఫిర్యాదుతో దొరికిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.

పత్తి కూపన్ కు రూ.30వేలు

జిల్లాలోని అశ్వాపురం మండలంలో వ్యవసాయ అధికారి (Agriculture Officer) సాయి శంతన్ కుమార్ వద్దకు ఓ పత్తి రైతు వచ్చాడు. అతడు తన పంటను అమ్ముకునేందుకు అధికారిని కూపన్ ఇవ్వాలని కోరాడు. అయితే తనకు రూ.30వేలు ఇస్తేనే కూపన్ ఇస్తానని సదరు అధికారి లంచం డిమాండ్ చేశాడు. చేసేదేం లేక ఆ రైతు నగదు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు చెప్పాడు.

ఏసీబీకి చిక్కిన అధికారి

విషయం తెలుసుకున్న ఏసీబీ అధికారులు (ACB Raid) సదరు వ్యవసాయ అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే ఇవాళ రైతు అధికారి సాయి శంతన్ కుమార్ కు నగదు ఇస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సదరు అధికారిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Related Posts

Fish Venkat: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ (Fish Venkat) శుక్రవారం (జులై 18) రాత్రి కన్నుమూశారు. 53 ఏళ్ల ఆయన అసలు పేరు మంగిలంపల్లి వెంకటేశ్. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం(serious illness)తో…

IBPS PO 2025 Notification: డిగ్రీ అర్హతతో IBPSలో భారీ నోటిఫికేషన్.. 5,208 పోస్టులు భర్తీ! ఇలా అప్లై చేయండి!

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) మరియు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా రెండు కీలక నోటిఫికేషన్ల( Notifications)ను విడుదల చేశాయి. బ్యాంకింగ్, ఇంజనీరింగ్ రంగాల్లో ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. IBPS PO/MT…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *