TG Govt: అందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అత్యంత ప్రతిష్ఠాత్మంగా తీసుకున్న నిర్ణయాలలో కొత్త రేషన్ కార్డుల(New Ration Cards) జారీ ఒకటి. ఇందుకోసం ఇప్పటికే దరకాస్తులు(Applications) స్వీకరిస్తున్న సర్కార్.. తర్వలోనే కొత్త కార్డులను జారీ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు సీఎం రేవంత్(CM Revanth) తాజాగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొత్త, పాత కార్డుదారులందరికీ స్మార్ట్ కార్డులు(Smart Cards) అందజేయాలని సీఎం ఆదేశించారు. దీంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఉగాది(Ugadi Festival) రోజు కొత్త కార్డులను ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళికలు చేపడుతోంది.

TG Ration Cards: తెలంగాణలో సర్కారు గుడ్ న్యూస్, కొత్త రేషన్ కార్డుల జారీకి  రెడీ అవుతున్న ప్రభుత్వం-good news from the government in telangana the  government is getting ready to issue ...

స్మార్ట్ రేషన్ కార్డులపై క్యూఆర్ కోడ్

ఇదిలా ఉండగా ప్రతి స్మార్ట్ రేషన్ కార్డుకు ఓ క్యూఆర్ కోడ్(QR Code) పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్డుకు ఒకవైపు ప్రభుత్వ లోగో, కుటుంబ పెద్ద వివరాలు, హోలోగ్రామ్, మరోవైపు కార్డుదారుడి పూర్తి చిరునామా(Adress), క్యూఆర్ కోడ్ ముద్రించనున్నారు. ఇందుకోసం పౌరసరఫరాల శాఖ టెండర్లను ఆహ్వానించింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి కోటి, దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న వారికి 20లక్షల చొప్పున మొత్తం 1.20 కోట్ల రేషన్ కార్డుల ముద్రణకు పౌరసరఫరాల శాఖ టెండర్లు పిలిచింది.

Smart Ration Card: Good news! Now you can apply Smart Ration Card online  sitting at home, the process is very easy, know here - Business League

అందుకే కార్డుల పంపిణీ ఆలస్యం

రాష్ట్రంలో దాదాపు 90లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు లక్షల సంఖ్యలో ఉన్నారు. వారిలో జిల్లాల వారీగా ప్రభుత్వం అర్హులను గుర్తించింది. వారికి ఎన్నికల కోడ్(Election Code) లేని జిల్లాల్లో మార్చి 1వ తేదీ నుంచి, మిగతా జిల్లాల్లో మార్చి 8వ తేదీ తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, స్మార్ట్ కార్డు రూపంలో రేషన్ కార్డులు ఇవ్వనున్న నేపథ్యంలో కార్డుల జారీ ప్రక్రియ ఆలస్యమవుతుందని అధికారులు చెబుతున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *