
తెలంగాణ(Telangana)లో 120 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్ల పదవికాలం నిన్నటితో (జనవరి 26)తో ముగిసింది. అలాగే కరీంనగర్ కార్పొరేషన్(Karimnagar Corporation)కు ఎన్నికైన సభ్యుల పదవి కాలం జనవరి 28తో ముగియనుంది. ఆయా మున్సిపాలటీలు, కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్ల(Special Officers)ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020లో వీటికి ఎన్నికలు నిర్వహించారు. ఐదేళ్ల పదవికాలం ముగియడంతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ వారి ప్లేస్లో స్పెషల్ ఆఫీసర్లును అపాయింట్ చేశారు. దీంతో వీరికి నేటి నుంచి స్పెషల్ అధికారులు ఉండటనున్నాయి.
కొత్తగా 12 మున్సిపాలిటీలు
రాష్ట్ర వ్యాప్తంగా 142 మున్సిపాలిటీలు(Municipalities) ఉండగా, ఇటీవల అసెంబ్లీలో 12 కొత్త మున్సిపాలిటీలను ప్రభుత్వం ప్రకటించింది. వీటితో కలిపితే 154. అయితే 2020లో 130 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించిన పాలక వర్గాల గడువు ఈ నెల 26తో ముగిసింది. వీటికి, కొత్తగా ఏర్పాటైన 12 మున్సిపాలిటీలకు కలిపి ఏప్రిల్(April) నాటికి ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. కాగా మున్సిపాలిటీలకు RDOలు, మున్సిపల్ కార్పొరేషన్లకు కలెక్టర్లు స్పెషల్ ఆఫీసర్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
2020లో 130 మున్సిపాలిటీలకు ఎన్నికలు
142 మున్సిపాలిటీలలో 2020లో 130 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగ్గా, 2021లో GHMCతోపాటు గ్రేటర్ వరంగల్, ఖమ్మం, అచ్చంపేట, కొత్తూరు, నకిరేకల్, సిద్ధిపేట, జడ్చర్ల మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. మరో నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించలేదు. అందులో ఏజెన్సీ(Agency) పరిధిలో ఉన్న పాల్వంచ, మణుగూరు, మందమర్రితోపాటు జహీరాబాద్ ఉన్నాయి.