పంద్రాగస్టు సందర్భంగా 1037 మందికి పతకాలు.. తెలంగాణ హెడ్ కానిస్టేబుల్​కు రాష్ట్రపతి శౌర్య పతకం

ManaEnadu:స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా గ్యాలంటరీ పతకాలు సాధించిన వారి జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య గ్యాలంటరీ పతకం లభించింది. దేశం మొత్తం మీద ఒక్కరికే ఈ పతకం లభించడం గమనార్హం. మొత్తం 1037 మందికి రాష్ట్రపతి పోలీస్‌ సేవా పతకాలను ప్రకటించగా.. ఒకరికి రాష్ట్రపతి గ్యాలంటరీ మెడల్, 208 మందికి పోలీసులకు గ్యాలంటరీ, 75 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా , 624 మందికి పోలీసు సేవా పతకాలు ప్రకటించింది.

ఏపీ నుంచి 25 మంది, తెలంగాణ నుంచి 21 మంది పోలీసులకు పతకాలు దక్కాయి. ఏపీలో ఇద్దరికి రాష్ట్రపతి పోలీస్‌ విశిష్ఠ సేవా పతకం, నలుగురికి పోలీస్‌ గ్యాలంటరీ పతకాలు, 19 మందికి విశిష్ఠ సేవా పతకాలు లభించగా.. తెలంగాణలో ఒకరికి ప్రెసిడెంట్ గ్యాలంటరీ పతకం, ఏడుగురికి పోలీస్‌ గ్యాలంటరీ, 11 మందికి పోలీస్‌ సేవా పతకాలు, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు దక్కాయి. తెలంగాణ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు రాష్ట్రపతి గ్యాలంటరీ మెడల్ లభించింది.

ఏపీలో గ్యాలంటరీ మెడల్​ దక్కిన అధికారులు

ఇన్​స్పెక్టర్ షేక్ సర్దార్ ఘని
సబ్ ఇన్​స్పెక్టర్ అరుణ్ కుమార్,
రిజర్వ్ సబ్ ఇన్​స్పెక్టర్ వెంకటరామ పరదేశీ
హెడ్ కానిస్టేబుల్ రాజన గౌరీ శంకర్

తెలంగాణలో గ్యాలంటరీ మెడల్​ దక్కిన అధికారులు

ఏపీఎస్ సునీల్ దత్
డిప్యూటీ అసాల్ట్ కమాండర్ కుమార్
అసిస్టెంట్ అసాల్ట్ కమాండర్ సంతోశ్
జూనియర్ కమాండర్స్ సురేశ్, వంశీ, ఉపేందర్, రమేశ్

రాష్ట్రపతి విశిష్ట సేవా పురస్కారం

ఐజీ రవి ప్రకాష్‌ (ఆంధ్రప్రదేశ్‌)
ఇన్స్​పెక్టర్ దాసరి రాజు (ఆంధ్రప్రదేశ్‌ )
ఏడీజీ సంజయ్‌ కుమార్‌ జైన్‌ (తెలంగాణ)
డిప్యూటీ కమిషనర్‌ కటకం మురళీధర్‌ (తెలంగాణ)
ఉత్తమ ప్రతిభా పురస్కారాలు (తెలంగాణ)

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *