రాఖీ శుభ ముహూర్తం.. ఏ సమయంలో రాఖీ కట్టాలో తెలుసా?

ManaEnadu:సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయతకు గుర్తుగా రక్షా బంధన్ జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కడతారు. అన్నదమమ్ములు తమ అక్క చెల్లెల్లకు రక్షణగా నిలుస్తామని భరోసా కల్పిస్తూ వారికి బహుమతులు ఇస్తారు. ఆగస్టు 19వ తేదీన దేశవ్యాప్తంగా రాఖీ పండుగ జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో  ఏ సమయంలో రాఖీ కట్టకూడదు? ఏ సమయంలో కడితే మంచి ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందాం.

శ్రావణ పౌర్ణమి రోజున రక్షా బంధన్ జరుపుకుంటారు.  ఈ ఏడాది ఆగస్టు 19, 2024 సోమవారం నాడు రాఖీ పౌర్ణమి వచ్చింది. అయితే శాస్త్రాల ప్రకారం, భద్రకాలంలో సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు. భద్ర కాలం సమయం  సోమవారం సూర్యోదయం  5:53 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 1:32 గంటల వరకు ఉంటుంది. ఈ సమయం పూర్తయ్యాకే రాఖీ పండగను జరుపుకోవాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.

సోమవారం మధ్యాహ్నం 1:33 గంటల నుంచి రాత్రి 9:08 గంటల వరకు శుభ సమయం ఉందని.. ఈ సమయంలో రాఖీ కట్టొచ్చని చెబుతున్నారు. మధ్యాహ్నం 1:43 గంటల నుంచి సాయంత్రం 4:20గంటల వరకు, సాయంత్రం 6:56 గంటల నుంచి రాత్రి 9:08 గంటల మధ్య సమయంలో రాఖీ కడితే  సంవత్సరం అంతా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని మాచిరాజు కిరణ్​ కుమార్​ తెలిపారు. 

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *