నాగులవంచలో మాతృభాషా దినోత్సవ వేడుకలు

మన ఈనాడు: చింతకాని మండలం నాగులవంచ శ్రీ ఆదర్శ విద్యాలయంలో మాతృభాషా దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాతృభాష తెలుగు యొక్క గొప్పతనాన్ని మాతృభాష నేర్చుకోవటం వల్ల కలుగు ప్రయోజనాన్ని విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ బోడేపూడి కిరణ్ విద్యార్థులకు వివరించారు.

స్థానిక భాష గుర్తింపులో ముఖ్యమైన భాగంగా తెలుగు భాష కావటం మనకు గర్వకారణం అని ఆయన పేర్కొన్నారు. మాతృభాషను బాగా నేర్చుకోవడం వల్ల ప్రతి ఒక్కరూ స్వంత గుర్తింపును పొందవచ్చు అన్నారు . ఇది ప్రపంచంలోని విభిన్న సంస్కృతుల పట్ల పూర్తిస్థాయి అవగాహన కలిగిస్తుంది అన్నారు.

సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కఠిన పదాల డిక్టేషన్ , మంచి దస్తూరి, చిత్రలేఖనం, మాతృభాష ఆవశ్యకత అనే అంశంపై వ్యాసరచన, పద్యాలు రాగ భావ యుక్తంగా ఆలపించడం, తెలుగు వారందరం తెలుగులోనే మాట్లాడదాం, కథ చెప్పటం అనే అంశాలపై ప్రతిభ పోటీ నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ చావా అరుణ్ కుమార్, తెలుగు ఉపాధ్యాయురాలు బోళ్ళా రేణుక, ఉపాధ్యాయులు గోపి, వినీల, కిరణ్, పార్వతి, భీమల్, శ్రీనివాస్, సుజాత , రాధా, త్రివేణి, రాశి , శైలజ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

JNV: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మరోసారి నవోదయ విద్యాలయాల్లో దరఖాస్తు గడువు పెంపు

విద్యార్థులకు శుభవార్త. దేశవ్యాప్తంగా ఉన్న జవరహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు(Application Deadline)ను అధికారులు మరోసారి పొడిగించారు. అర్హులైన, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆగస్టు 27వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. 2026- 27…

TG TET: తెలంగాణ టెట్​ రిజల్ట్స్​ వచ్చేశాయ్​..

తెలంగాణ టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్ (టీజీ టెట్) (TG TET) రిజల్ట్స్​ వచ్చేశాయి. సచివాలయంలో మంగళవారం ఉదయం 11గంటలకు విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా రిలీజ్ చేశారు. జూన్ 18 నుంచి 30వ తేదీల మధ్య ఆన్లైన్ పరీక్షలు జరిగాయి. మొత్తం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *