Alai Balai: అక్టోబర్ 13న ‘అలయ్ బలయ్‌’ స్నేహ సమ్మేళనం.. సీఎంకు ఆహ్వానం

Mana Enadu: తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయానికి ప్రతిబింబం అలయ్ బలయ్ కార్యక్రమం. అన్ని వర్గాల ప్రజలను, అన్ని పార్టీల రాజకీయ నేతలను ఏకతాటిపైకి తీసుకువచ్చే ఓ గొప్ప వేడుక. కుల, మతాలకు అతీతంగా ఏటా దసరా పండుగ తర్వాతి రోజు ఈ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ‍‍హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్ దీనికి వేదికగా నిలుస్తోంది. ఈ వేడుకకు పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు, సినీ ప్రముఖులు తప్పక హాజరువుతూ ఉంటారు. బండారు దత్తాత్రేయ ప్రస్తుతం హరియాణా గవర్నర్‌గా ఉన్నప్పటికీ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అక్టోబర్ 13న జరిగే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ఆహ్వానించారు. ఈ విషయాన్ని సీఎం ట్వీట్ చేశారు. తెలంగాణ సమాజంలో ఆత్మీయత, అనుబంధాలకు ప్రతీక ఈ కార్యక్రమమని పేర్కొన్నారు.

కాగా గత పదిహేడు సంవత్సరాలుగా ఈ అలయ్ బలయ్ కార్యక్రమం కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో జరుగుతోంది. దసరా తరువాత రోజు జరిగే ఈ కార్యక్రమానికి వచ్చే అతిథులకు తెలంగాణ వంటకాలను రుచి చూపిస్తుంటారు. ముఖ్యంగా నాన్‌వెజ్ వంటకాలైన మటన్, చికెన్, పాయా, హలీంతోపాటు వివిధ రకాల తెలంగాణ పిండి వంటలు కూడా అతిథులకు వడ్డిస్తారు. బండారు దత్తాత్రేయ ఎక్కాడున్నా, ఏ పదవిలో ఉన్నా, ఆయన మనసెప్పుడు హైదరాబాద్’లోనే ఉంటుందనే దానికి ఈ కార్యక్రమం ఓ ఉదాహరణ. గతంలో ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ సైతం హాజరయ్యారు. అంతేకాదు ‘అలయ్‌ బలయ్‌’ వంటి కర్యక్రమాలు ప్రజల్లో ఐకమత్యం, సమానత్వాన్ని పెంచుతుందని ప్రధాని మోదీ కొనియాడారు కూడా.

తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా..

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక పేరుతో 2009 నుంచి అలయ్ బలయ్‌ స్నేహ సమ్మేళనం జరుగుతోంది. ఇందులో తెలంగాణ జానపద కళారూపాలైన ఒగ్గుకథలు, గోండు నృత్యం, పీర్లు, గొర్లకాపరులు, పోతరాజులు, సాధ్యశూరులు, బోణాలు, బంతిపూల బతుకమ్మ, గంగిరెద్దులు, సీతమ్మ జడకొప్పులు వంటి వాటితోపాటు, కోలాటాలు, భజనకీర్తనలు, సన్నాయి బాజాలు, జమిడిక మోతలు, బోనాలు, ఘటాలు, వంటివి విశేషంగా ఆకట్టుకుంటాయి.

https://x.com/revanth_anumula/status/1825781640523821552

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *