ఆలయ పనులు చేస్తుంటే బయట పడ్డ నిధి..చూసేందుకు పొటెత్తిన జనాలు

మన ఈనాడు:నెల్లూరు జిల్లా గుడ్లూరులో స్థానిక పురాతన శివాలయంలో  జీర్ణోద్ధరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్వతి అమ్మవారు, వినాయకస్వామి ధ్వజ స్తంభాలను తొలగించారు.
ఈ సమయంలో ధ్వజ స్తంభం కింద 405 పురాతన నాణేలు, వినాయకస్వామి ప్రతిమ కింద 105 నాణేలు లభించాయి. ధ్వజస్తంభం కింద లభించిన నాణేలు 1800-1850 కాలం నాటివిగా గుర్తించారు. వినాయకస్వామి ప్రతిమ కింద లభించినవాటికి ఎలాంటి ముద్రలు లేవు. వీటన్నింటిని నిర్వాహకులు స్థానికంగా భద్రపరిచారు.

మళ్లీ ప్రతిష్ఠ సందర్భంగా వీటిని వినియోగించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమ సమయంలో ఇవి బయటపడటం ఆసక్తికరంగా మారింది. పురాతన నాణేలు కావడంతో స్థానికంగా చర్చ జరిగింది. స్థానికులు ఈ నాణేలు చూసేందుకు భారీగా తరలివచ్చారు. ఆలయాలు నిర్మించే సమయంలో వీటిని ధ్వజ స్తంభాల కింద ఉంచి ఉంటారని భావిస్తున్నారు. గతంలో కూడా పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ కార్యక్రమాలు చేపట్టే సమయంలో ఇలాగే నాణేలు బయటపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *