ఏపీ సీఎం సహాయనిధికి రూ.400 కోట్ల విరాళాలు

Mana Enadu : గత పదిహేను రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు (Telugu States Rains) బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో వరణుడు విలయం సృష్టించాడు. భారీ వరదలు ఈ ప్రాంతాల్లో ప్రజలకు నిలువ నీడ లేకుండా చేశాయి. వరద బాధితుల దీనస్థితి చూసి ఎంతో మంది ప్రముఖులు, ప్రముఖ సంస్థలు, ఎన్జీవోలు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధులకు పెద్ద ఎత్తున విరాళాలు వచ్చాయి.

వరద బాధితులకు (Flood Victims) సాయం చేసేందుకు పెద్ద ఎత్తున అందరూ ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం సహాయనిధికి ఏకంగా రూ.400 కోట్ల విరాళాలు వచ్చాయి. ఇది ఒక చరిత్ర అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu) అన్నారు. తనతో పాటు ఉద్యోగులంతా 11 రోజుల పాటు నిర్విరామంగా పనిచేశారని తెలిపారు. వరద నీటిలో బాధితులకు అన్నిరకాల సాయం అందించే ప్రయత్నం చేశామని వెల్లడించారు.

విజయవాడలో వరద బాధితులకు ఆర్థిక సాయం (Flood DOnations) అందజేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వరద సమయంలో అందరం కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లినట్లు తెలిపారు. పెద్ద విపత్తు కలిగినప్పుడు అందరం ఒక్కటై పనిచేయగలిగామని అన్నారు.

ఒకవైపు వర్షపు నీరు వస్తుంటే.. మరోవైపు బుడమేరు (AP Budameru) నీరు పోటెత్తిందని.. అధికార యంత్రాంగంతో పాటు తాను స్వయంగా బురదలో దిగానని గుర్తు చేశారు. తక్కువ సమయంలో విపత్తు నుంచి బయటపడగలిగామని వెల్లడించారు. విరాళాల కోసం రాష్ట్రప్రజలంతా బ్రహ్మాండంగా స్పందించారన్న చంద్రబాబు.. వరద బాధితులకు సాయం చేద్దామని పిలుపునిస్తే అంతా ముందుకొచ్చారని అన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *