టెర్రర్ అటాక్ అలర్ట్.. జమ్ముకశ్మీర్​లో 48 పర్యటక ప్రాంతాల మూసివేత

పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Attack) వల్ల జమ్ము కశ్మీర్ పర్యటకంపై తీ​వ్ర ప్రభావం పడింది. భయంతో చాలా మంది ప్రజలు అక్కడికి వెళ్లడానికి భయపడుతున్నారు. మరోవైపు జమ్ముకశ్మీర్ లో ఇంకా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని భావిస్తున్న ప్రభుత్వం 87 పర్యటక ప్రాంతాల్లో (Jammu Kashmir Toursim) 48 ప్రదేశాలను మూసివేసింది. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని భద్రతా ఏజెన్సీల హెచ్చరికలతో జమ్ము కశ్మీర్​ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

కశ్మీర్ పై ఉగ్ర నీడలు

కశ్మీర్​ లోయలో కొంత మంది స్లీపర్ సెల్స్​ యాక్టివ్ (Sleeper Cells in Kashmir) అయి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు భద్రతావర్గాలకు సమాచారం అందింది. ఉత్తర, మధ్య, దక్షిణ కశ్మీర్​ ప్రాంతాల్లో భారీ దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా శ్రీనగర్, గండేర్బల్​ ప్రాంతంలోని కశ్మీర్​ పండిట్​లు, అధికారులు, లోయలోని రైల్వే సిబ్బంది, మౌలిక సదుపాయాలపైనా దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించాయి. మరోవైపు ఇంటిలిజెన్స్​ సమాచారంతో అప్రమత్తమైన భద్రతాదళాలు, సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాయి.

టెర్రర్ అటాక్ అలర్ట్

జమ్ముకశ్మీర్ లో ఇంకా ఉగ్రవాద నీడలు (Terror Attack ALert) కమ్ముకునే ఉన్నాయి. మాకు అందిన సమాచారం ప్రకారం ఉత్తర, మధ్య, దక్షిణ కశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కశ్మీర్ పండిట్ లు, అధికారులు, రైల్వే అధికారులతో పాటు సిబ్బందిని టార్గెట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మీరంతా క్యాంపులు, బ్యారక్​లను విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లవద్దు. అని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *