Bigg Boss 8 : సెకండ్ వీక్ ఎలిమినేషన్స్.. హౌస్ నుంచి బయటికి వెళ్లేదెవరు?

Mana Enadu : బిగ్ బాస్ తెలుగు సీజన్-8 (Bigg Boss 8) రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. చిన్నచిన్న గొడవలు, అలకలు, బుజ్జగింతలు, బిగ్ బాస్ టాస్కులు, కంటెస్టెంట్ల స్ట్రాటజీలతో ఈ సీజన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చూస్తుండగానే రెండో వారం కూడా ముగిసింది. ఇప్పటికే మొదటి వీక్ లో బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇవాళ్టి సండే ఎపిసోడ్ (సెప్టెంబరు 15వ తేదీ) లో హౌస్ నుంచి ఎవరు వెళ్లిపోతున్నారు?

ఈ వారం మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్లు (Bigg Boss Elimination) నామినేట్​ అయిన విషయం తెలిసిందే. వారిలో శేఖర్ బాషా, పృథ్వీరాజ్, నిఖిల్, ఆదిత్య, నాగ మణికంఠ, నైనిక, సీత, విష్ణు ప్రియ ఉన్నారు. అయితే ఇవాళ్టి ఎపిసోడ్ లో ఎలిమినేషన్ కత్తి శేఖర్ బాషా, ఆదిత్య ఓంలపైనే ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ఎనిమిది మందిలో సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న నిఖిల్ (Nikhil), విష్ణుప్రియ సేఫ్ జోన్ లో ఉన్నట్లు తెలిసింది. సింపతి కార్డు ప్లే చేసిన నాగ మణికంఠ ఇప్పుడు ఆట తీరును మెరుగు పరుచుకుని ఈ వీక్ సేఫ్ జోన్లో ఉన్నట్లు టాక్.

ఇక డేంజర్ జోన్​లో ఉన్నది మిగతా ఐదుగురు నైనిక, పృథ్వీరాజ్​, సీత, శేఖర్​బాషా, ఆదిత్య ఓం (Adithya Om). చివరలో ఉన్న ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నా.. ఎలిమినేట్ అయ్యే ఛాన్స్  ఆదిత్యకే ఉన్నట్లు టాక్. అయితే ఈ వీకెండ్ ఊహించని పరిణామం చోటు చేసుకోబోతోందని బిగ్ బాస్ వర్గాల్లో టాక్. అయితే డబుల్ ఎలిమినేషన్ (Double Elimination) ఉండే ఛాన్స్ ఉందని నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. అదే నిజమైతే శేఖర్ బాషా, ఆదిత్య ఓం ఇద్దరూ ఎలిమినేట్ అవ్వడం ఖాయం. ఏం జరుగుతుందో తెలియాలంటే ఇవాళ్టి ఎపిసోడ్ చూడాల్సిందే.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *