Sikkim: 12ఏళ్లుగా కడుపులోనే కత్తెర.. సిక్కింలో వైద్యుల నిర్లక్ష్యం

Mana Endau: వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాల మీదకు వచ్చింది. సిక్కిం(Sikkim)లోని ఓ మహిళకు 12 ఏళ్ల క్రితం అపెండిక్స్ ఆపరేషన్(Appendix operation) జరిగ్గా ఆ సమయంలో డాక్టర్లు కత్తెరను కడుపు(Doctors scissors in the stomach)లోనే ఉంచి మరిచిపోయారు. అయితే తన సమస్యకు ఆపరేషన్(Operation) చేపించుకున్నా.. మళ్లీ నిత్యం కడుపునొప్పి(stomach pain) రావడం ఆమె ఇబ్బంది పడింది. ఈ క్రమంలో మరోసారి స్కానింగ్(Scanning) చేపించడంతో అసలు విషయం బయటపడింది.

 ఎంతోమంది వైద్యుల దగ్గరకు వెళ్లినా..

వైద్యులు చేసిన నిర్లక్ష్యం(Medical Negligence) పని వల్ల ఓ మహిళ 12 ఏళ్లుగా నరకాన్ని అనుభవించింది. ఆపరేషన్ చేసినప్పుడు డాక్టర్ల నిర్లక్ష్యం, మతిమరుపు వల్ల సదరు యువతి తీవ్రంగా క్షోభపడింది. ఈ సర్జరీ(Surgery) జరిగే సమయంలో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆమె పొత్తి కడుపులోనే కత్తెరను వదిలేశారు. అయితే తన బాధను తీర్చమంటూ ఎంతోమంది వైద్యుల దగ్గరకు వెళ్లిన కూడా ఆమెకు పొత్తి కడుపులో నొప్పి మాత్రం తగ్గలేదు. చివరకు స్కానింగ్ చేయడంతో కడుపులో కత్తెర ఉన్నట్లు తెలిసింది. దీంతో మళ్లీ ఆపరేషన్ చేసి ఆ కత్తెరను బయటికి తీశారు.

 ఆసుపత్రిపై కేసు నమోదు

ఆ మహిళ 2012లో అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించుకుంది. గ్యాంగ్‌టక్‌(Gangtok)లోని సర్ థుటోబ్ నామ్‌గ్యాల్ మోమరియల్(STNM) ఆసుపత్రి వైద్యులు సర్జరీ చేశారు. ఈ సమయంలో ఆమె కడుపులో కత్తెర(scissors)ను వైద్యులు మర్చిపోయారు. అలా అప్పటి నుంచి ఈ కత్తెర కడుపులోనే ఉండిపోవడంతో ఆమె తీవ్ర నొప్పికి గురయ్యింది. ఈ విషయం బయటపడటంతో సదరు ఆసుపత్రిపై ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసు అధికారులు ఆ హాస్పిటల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *