Delhi CM: ఈనెల 19 లేదా 20న ఢిల్లీ సీఎం అభ్యర్థి ప్రమాణం!

అందరూ ఉత్కంఠగా ఎదురుచూసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Elections) ఫలితాలు ఈ నెల 8న వెలువడిన విషయం తెలిసిందే. మొత్తం 70 స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో BJP రికార్డు స్థాయిలో 48 సీట్లు నెగ్గి ఘనవిజయం సాధించింది. అంత వరకూ బాగానే ఉంది. కానీ కమలం పార్టీకి అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. ఢిల్లీ సీఎంగా ఎవరిని(Who is Delhi Cm) ఎంపిక చేయాలన్న దానిపై బీజేపీ అధిష్ఠానం మళ్లగుల్లాలు పడుతోంది. అయితే సీఎం అభ్యర్థి ఎంపికై ప్రధాని మోదీ(PM Modi) లేకపోవడంతో ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.

మోదీ రాగానే బీజేపీ శాసనసభా పక్ష సమావేశం

మోదీ ఫ్రాన్స్(France), అమెరికా(USA) పర్యటన ముగించుకొని భారత్ రాగానే CM అభ్యర్థి ఎంపిక ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు సీఎం అభ్యర్థి ప్రమాణ స్వీకారం ఈనెల 19 లేదా 20 తేదీల్లో ఉంటుందని కమలం పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 18, 19 తేదీల్లో బీజేపీ శాసనసభా పక్ష(BJP Legislative Party Meeting) నేతలు సమావేశం కానున్నారని తెలుస్తోంది. ఈ భేటీకి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah), పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కీలక నేతలు హాజరు కానున్నారు. ఈ సమావేశం అనంతరం సీఎం ఎవరనేదానిపై స్పష్టత రానుంది.

Delhi polls updates: BJP to form govt in Delhi after 26 yrs, wins 48 seats;  AAP 22, Cong draws blank | Delhi Election News - Business Standard

15 మందితో జాబితా సిద్ధం?

ఎన్నికల్లో గెలిచిన 48 మంది MLAల్లో 15 మందితో అధిష్ఠానం ఓ జాబితా రూపొందించిందని సమాచారం. ఇందులో తొమ్మిది మందిని CM, స్పీకర్, క్యాబినెట్ స్థానాలకు ఎంపిక చేయనుంది. ఢిల్లీ CM రేసులో అరవింద్ కేజ్రీవాల్‌(Kejriwal)ను ఓడించిన పర్వేశ్ వర్మ(
Parvesh Verma), సతీశ్ ఉపాధ్యాయ్, విజయేందర్ గుప్తా, ఆశిష్ సూద్, పవన్ శర్మ వంటి పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. పూర్వాంచల్ నేపథ్యం కలిగిన ఎమ్మెల్యే, సిక్కు లేదా మహిళను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. మొత్తం మీద ఢిల్లీ పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *