CT2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ ఎంతంటే?

మరో 5 రోజుల్లో మినీ వరల్డ్ కప్‌గా భావించే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్(Pakistan), UAE వేదికగా ఈ మినీ సంగ్రామం మొదలు కానుంది. మార్చి 9న ఫైనల్ జరుగుతుంది. కాగా ఇప్పటికే మార్పులు చేర్పుల అనంతరం భారత్(Team Indai) సహా అన్ని జట్లు తమ తుది జట్ల(Final Teams)ను ప్రకటించాయి. తాజాగా ఈ గ్రాండ్ ఈవెంట్‌కు సంబంధించి ఐసీసీ ప్రైజ్ మనీ(Prize money) విడుదల చేసింది. మొత్తం రూ.60 కోట్లను ఈసారి టోర్నీకి కేటాయించింది. మరి ఈ మొత్తంలో ఏ జట్టు ఎంత మొత్తం దక్కించుకుంటుందో ఓ సారి చూద్దామా..

మొత్తం ప్రైజ్ మనీ రూ.60 కోట్లు
☛ విజేతకు – రూ. 20.8కోట్లు
రన్నరప్‌కు – రూ. 10.4 కోట్లు.
☛ సెమీ ఫైనలిస్టులకు – రూ. 5.2 కోట్లు.
5,6వ స్థానాల్లోని జట్లకు – రూ.3 కోట్లు
☛ 7,8వ స్థానాల్లోని జట్లకు – రూ.1.2 కోట్లు.
ప్రతి మ్యాచ్‌కి – రూ. 29 లక్షలు

ICC Champions Trophy 2025: పాక్ కుట్రలు... దక్షిణాఫ్రికాలో ఛాంపియన్స్ ట్రోఫీ  2025 ?

మొత్తం 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు గ్రూప్-Aలో ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఉండగా.. గ్రూప్-Bలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్ జట్లు ఉన్నాయి. ప్రతి జట్టు గ్రూపులోని ఇతర జట్లతో ఒక్కోమ్యాచ్ ఆడుతుంది. టాప్‌-2లో నిలిచిన జట్లు సెమీస్‌(Semis)కు చేరుతాయి. సెమీస్‌లో నెగ్గిన జట్లు మార్చి 9న ఫైనల్‌(Final)లో తలపడుతాయి.

Related Posts

సొంతగడ్డపై సన్‘రైజర్స్’.. రాజస్థాన్‌పై 44 రన్స్‌ తేడాతో గ్రాండ్ విక్టరీ

ఐపీఎల్ రెండో మ్యాచ్‌లో సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) అదరగొట్టింది. ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌(RR)తో జరిగిన మ్యాచులో 44 పరుగుల తేడాతో గ్రాండ్ విజయం సాధించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచులో ఇరు జట్ల బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి…

Sikindar: ‘సికిందర్’ ట్రైలర్ రిలీజ్.. వింటేజ్ లుక్‌లో సల్మాన్‌భాయ్

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్(Salman Khan), ప్రముఖ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్(A.R. Murugadoss) కాంబోలో తెరకెక్కిన మూవీ ‘సికిందర్(Sikindar)’. ఈ మూవీలో సల్మాన్‌కు జోడీగా సక్సెస్‌ఫుల్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) నటిస్తోంది. సత్యరాజ్, కాజల్ అగర్వాల్(Kajal Agarwal)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *