దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli), టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ (Mahesh Babu) బాబు కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. SSMB29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగుకు సంబంధించి ఇటీవలే పలు వీడియోలు, ఫొటోలు లీక్ అయ్యాయి. మొదటి నుంచి ఈ సినిమాపై సస్పెన్స్ క్రియేట్ చేస్తూ.. సీక్రెసీ మెయింటైన్ చేస్తున్న జక్కన్న.. ఈ లీకుల వల్ల అలర్ట్ అయ్యాడు. ఇక నుంచి ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి లీకులు వైరల్ కాకుండా జాగ్రత్త పడుతున్నాడు.
SSMB29పై డిప్యూటీ సీఎం పోస్టు
అయితే ప్రస్తుతం SSMB29 మూవీ షూటింగు ఒడిశాలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి (AP Deputy CM) ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. SSMB29 చిత్ర షూటింగు తమ రాష్ట్రంలో జరగడం తమకు గర్వకారణమని ఒడిశా డిప్యూటీ సీఎం ప్రవతి పరిదా పోస్టులో పేర్కొన్నారు. ఇది స్థానికంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు తమ రాష్ట్రాన్ని సినిమా షూటింగులకు ఆకర్షణీయ కేంద్రంగా మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Before, Pushpa-2 in Malkangiri, and now, renowned director SS Rajamouli’s upcoming film SSMB29, starring South superstars Mahesh Babu and Prithviraj Sukumaran, along with internationally acclaimed actress Priyanka Chopra, is being shot in Koraput, proving that Odisha has a wealth…
— Pravati Parida (@PravatiPOdisha) March 11, 2025
మా రాష్ట్ర పర్యటకానికి మేలు
“గతంలో మల్కాన్గిరిలో పుష్ప-2 (Pushpa 2 : The Rule) షూటింగ్ జరిగినట్లే.. ఇప్పుడు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న SSMB29 షూటింగు ఒడిశాలోని కోరాపుట్లో జరుగుతోంది. ఈ చిత్రంలో టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాలీవుడ్ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్, గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) వంటి అగ్రనటులు కనిపించనున్నారు. వీరంతా మా రాష్ట్రంలో షూటింగ్ కోసం రావడంతో మా రాష్ట్ర ప్రఖ్యాతి మరింత పెరిగింది. రాజమౌళి సినిమా షూటింగు వల్ల ఒడిశాలో భవిష్యత్తులో సినిమా షూటింగ్ తో పాటు టూరిజానికి మంచి డిమాండ్ ఏర్పడుతుందని భావిస్తున్నాం. మా వద్ద షూటింగ్స్ చేసుకునేందుకు అన్ని భాషల ఇండస్ట్రీలను సాదరంగా స్వాగతిస్తున్నాం.” అంటూ డిప్యూటీ సీఎం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.






