Telangana Govt: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

మన ఈనాడు: తెలంగాణ ఇచ్చిన పార్టీగా.. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్‌. కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ప్రమాణం చేయగా.. మరో 11మంది కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. వెంటనే తెలంగాణ నూతన కేబినెట్ తొలి సమావేశం జరిగింది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో మంత్రులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి మండలి సమావేశంలో ఆరు గ్యారంటీలపై సుదీర్ఘంగా చర్చించినట్లు పేర్కొన్నారు. 2014- నుంచి2023 డిసెంబర్ 7 వరకు రాష్ట్రఖర్చుపై చర్చించినట్లు తెలిపారు.
తెలంగాణ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై.. శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు శ్రీధర్‌బాబు తెలిపారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9న రెండు గ్యారంటీలు అమలు చేయాలని కేబినెట్ తీర్మానించిందని.. ఆరోజు నుంచి అమలు చేస్తామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, అలాగే ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు హామీలను డిసెంబర్ 9 నుంచి అమలు చేస్తామని తెలిపారు. మిగిలిన నాలుగు గ్యారెంటీలపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో 24 గంటల పాటు విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. 200 ల యూనిట్ల వరకు ఉచితం అన్న హామీ విషయంపై విద్యుత్ శాఖ అధికారులతో చర్చించనున్నట్లు తెలిపారు.

తొలి క్యాబినెట్ సమావేశం హాట్ హాట్ గా సాగింది. విద్యుత్ శాఖ రివ్యూలో విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యుత్ శాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దాచిపెట్టడంపై సీఎం సీరియస్ అయ్యారు. విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని అభిప్రాయపడ్డారు. రేపటిలోగా పూర్తి వివరాలతో రావాలని ఆదేశించారు. సీఎండీ ప్రభాకర్‌రావు రాజీనామాను ఆమోదించవద్దని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా, రేపు విద్యుత్ శాఖపై చర్చించనున్నారు. విద్యుత్ శాఖలో ఇప్పటివరకు 85 వేల కోట్ల అప్పులు ఉన్నట్లు అధికారులు సీఎంకు చెప్పారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *