Paleru reservoir: సాగర్​ జలలు కోసం..BRS నేతల ఆందోళ

Khammam: కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం, వైఫల్యం కారణంగానే పంటలు ఎడిపోతున్నాయని ఖమ్మం బీఆర్​ఎస్​ నాయకులు ఆందోళన చేపట్టారు. తక్షణమే సాగర్​ జలాలతో పాలేరు రిజర్వాయర్​ నింపాలని డిమాండ్​ చేశారు.

పూర్తిగా అడుగంటిన పాలేరు జలాశయాన్ని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు(MLC THATHA MADHU) అధ్వర్యంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు , రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పాలేరు జలాశయం పరిశీలించారు. నేలకొండపల్లి మండల పరిధిలోని ఎండిపోయిన పంట పోలాలను వారు పరిశీలించి తక్షణమే నీళ్లు విడుదల రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలకు ఇప్పటికే తాగునీళ్లు లేక అల్లాడుతున్నారన్నారు. ప్రజల పక్షాన తాము పోరాడి అండగా నిలుస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఇప్పటికైనా కాంగ్రెస్​ ప్రభుత్వ పెద్దల క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.

ఈకార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు , మాజీ ఎమ్మేల్యేలు సండ్ర వెంకట వీరయ్య , బానోత్ మధన్ లాల్, చంద్రావతి పాల్గొన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *