జగన్‌ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు.. కోర్టుకు సీబీఐ రిక్వెస్ట్

ManaEnadu:యూకే (బ్రిటన్) వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలన్న వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని కోర్టుకు సీబీఐ విజ్ఞప్తి చేసింది. జగన్‌ పిటిషన్‌పై వాదనలు ముగిసిన అనంతరం కోర్టు తన నిర్ణయాన్ని ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు విజయసాయి రెడ్డి పిటిషన్​పై తీర్పును 30వ తేదీకి వాయిదా వేసింది.

అక్రమాస్తుల కేసులో ఏ1, ఏ2లుగా ఉన్న మాజీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబరు మొదటి వారంలో యూకేలో చదువుతున్న కుమార్తె వద్దకు వెళ్లడానికి అనుమతించాలని పిటిషన్‌లో జగన్‌ కోరారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ టి.రఘురాం సీబీఐ వివరణ కోరుతూ విచారణను బుధవారానికి వాయిదా వేయగా.. తిరిగి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోరడంతో ఈనెల 27కు తన నిర్ణయాన్ని కోర్టు వాయిదా వేసింది.

మరోవైపు సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో యూకే, స్వీడన్, యూఎస్ వెళ్లేందుకు అనుమతివ్వాలని విజయసాయిరెడ్డి కోరగా.. ఆయనకూ అనుమతివ్వొద్దని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. ఏపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ తరచూ విదేశాలు, ఇతర నగరాల్లో పర్యటిస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత విదేశాలకు వెళ్లొచ్చిన ఆయన ఆ తర్వాత పలుమార్లు బెంగళూరుకు వెళ్లి వచ్చారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *