Explosion Incident: రియాక్టర్ పేలిన ఘటన.. మృతులు వీరే

Mana Enadu: ఏపీలోని అనకాపల్లి (Anakapalli)జిల్లాలోని ఎసెన్షీయా ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలిన(Reactor Blast) ఘటనలో ఇప్పటి వరకు 14 మంది చనిపోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు మృతుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. 25 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌(NDRF) సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. రియాక్టర్‌ పేలిన తరువాత ఓ భవనం కుప్పకూలడంతో ఆ శిథిలాల కింద మరికొందరు కార్మికులు ఉండవచ్చని భావిస్తున్నారు. కంపెనీ మూడో అంతస్తులో పలువురు కార్మికులు చిక్కుకోగా అగ్నిమాపక సిబ్బంది వారిని క్రేన్‌ సహాయంతో సురక్షితంగా కిందకు దించారు. మొత్తం 12 అగ్నిమాపక దళాలు మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఫార్మా కంపెనీలో రియాక్టర్‌పేలి కార్మికులు మృతి చెందడం దురదృష్టకరమని ఏపీ కార్మికశాఖ మంత్రి సుభాశ్ పేర్కొన్నారు. ఘటనా స్థలంలో కలెక్టర్‌, ఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తున్నారని తెలిపారు. మృతుల వివరాలు తెలిసేందుకు కొంత సమయం పడుతుందని అన్నారు. భారీగా పొగ వల్ల సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందని వెల్లడించారు.

 మృతులు వీరే..

ఎసెన్షియా కంపెనీ రియాక్టర్ పేలుడులో ఇప్పటివరకు 14 మంది మరణించగా వారిలో 10 మంది వివరాలు గుర్తించారు. మృతుల వివరాలు ఇవే..
1. సన్యాసినాయుడు(ప్లాంట్ ఏజీఎం)
2. రామిరెడ్డి(ల్యాబ్ హెడ్)
3. హారిక(కెమిస్ట్)
4. పార్థసారథి(ప్రొడక్షన్ ఆపరేటర్)5. వై.చిన్నారావు(ప్లాంట్ హెల్పర్)
6. మోహన్(ఆపరేటర్)
7. గణేశ్(ఆపరేటర్)
8. హెచ్.ప్రశాంత్
9. ఎం.నారాయణ10. పి.రాజశేఖర్ ఉన్నారు. మరో నలుగురి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Related Posts

Prakash Raj: బెట్టింగ్ యాప్స్ వ్యవహారం.. ఈడీ విచారణకు హాజరైన ప్రకాశ్ రాజ్

బెట్టింగ్ యాప్స్ వ్యవహారం సిని ఇండస్ట్రీలో కలకలం రేపిన విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అనుమానిస్తోంది. నిందితులుగా ఉన్న కొందరు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. పలువురు నటీనటుల మీద…

Payal Rajput: నటి పాయల్ రాజ్‌పుత్ ఇంట్లో తీవ్ర విషాదం

ప్రముఖ హీరోయిన్ నటి పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్(Vimal Kumar Rajput) (67) ఢిల్లీలో సోమవారం కన్నుమూశారు. ఈ విషాద సంఘటనను తాజాగా పాయల్ సోషల్ మీడియా(SM) ద్వారా వెల్లడించింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *