నాగ చైతన్య – శోభిత పెళ్లిపనులు ప్రారంభం

Mana Enadu:టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థ ఇటీవలే హైదరాబాద్​లో జరిగిన విషయం తెలిసిందే. ఎంగేజ్మెంట్​కు సంబంధించిన ఫొటోలను నాగార్జున సోషల్ మీడియాలో పోస్టు చేసి ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అలా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక పెళ్లి ఎప్పుడో మాత్రం అప్పుడు చెప్పలేదు. అయితే తాజాగా ఈ జంట పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి.

చై- శోభిత పెళ్లి పనులు షురూ

పసుపు దంచుతున్న ఫొటోలను శోభితా తన ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఇవి వైరల్‌గా మారాయి. పెళ్లి ఎక్కడ అని అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. విదేశాల్లో గ్రాండ్​గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారా లేదా ఇండియాలోనే చేసుకుంటారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. దాదాపుగా వీరి వివాహం హైదరాబాద్​లోనే ఘనంగా జరుగుతుందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు వీరి వివాహ తేదీ కూడా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

అనంతమైన ప్రేమకు నాంది

ఇక నాగ చైతన్య- శోభితా నిశ్చితార్థం 2024 ఆగస్టులో హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో జరిగిన విషయం తెలిసిందే. ఆ ఫొటోలను చైతూ ఫాదర్ కింగ్​ నాగార్జున సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. వారి జీవితం సంతోషం, ప్రేమతో నిండాలని కోరుకుంటూ 8.8.8 (08-08-2024) అనంతమైన ప్రేమకు నాంది అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. వచ్చే ఏడాది మార్చిలో వీరి పెళ్లి జరగనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపించగా.. ఇప్పుడేమో పెళ్లి పనులు ప్రారంభం కావడంతో ఆ తేదీ మరింత ముందుగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే తండేల్​తో

ఇక నాగచైతన్య సినిమాల సంగతికి వస్తే ప్రస్తుతం అతడు ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. సముద్రం బ్యాక్​డ్రాప్​లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో చైతూకు జోడీగా లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్​గా నటిస్తోంది. మరోవైపు శోభితా తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలో పలు సినిమాల్లో నటిస్తోంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *