తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు.. నటి కస్తూరికి రిమాండ్‌

Mana Enadu : తమిళనాడులో స్థిరపడ్డ తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ నటి కస్తూరి(Actress Kasturi)ని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆమెను కోర్టులో హాజరు పరచగా.. ఈ కేసు విచారించిన ఎగ్మోర్‌ మెట్రోపాలిటన్‌ న్యాయస్థానం 12 రోజుల పాటు ఆమెకు రిమాండ్‌ విధించింది. దీంతో పోలీసులు ఆమెను పుళల్‌ కేంద్ర కారాగారానికి తరలించారు.

న్యాయాన్ని గెలిపించండి

ఈ సందర్భంగా తీర్పు అనంతరం కోర్టు నుంచి బయటకు వచ్చిన కస్తూరి మీడియాతో మాట్లాడారు. ‘‘అధికార దుర్వినియోగానికి ముగింపు పలకండి. న్యాయాన్ని గెలిపించండి’’ అని ఆమె కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. తెలుగు వారికి కస్తూరి పరిచయమైన ముఖమే. తెలుగు టీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే ఓ ప్రముఖ సీరియల్ లో నటించి ఆమె తెలుగు ప్రేక్షకుల మనసు గెలిచారు. 

తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు

అయితే నవంబరు 3న చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తమిళనాడులోని తెలుగువారిపై కస్తూరి శంకర్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలుగు మాట్లాడే వారు తమిళనాడులో అంతఃపురంలో పని చేసే వారంటూ తెలుగు వాళ్లను తక్కువ చేసి మాట్లాడారంటూ ఆమెపై తెలుగు ప్రజలు ఆగ్రహించారు. ఈ వ్యవహారంపై తీవ్ర దుమారం రేగడంతోపాటు తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో ఆమెపై కేసులు నమోదయ్యాయి.

కస్తూరి అరెస్టు

ఈ కేసుల్లో తనకు ముందస్తు బెయిలు ఇవ్వాలంటూ కస్తూరి మదురై కోర్టును ఆశ్రయించచినా.. న్యాయస్థానం పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో గత కొంతకాలంగా ఆమె అజ్ఞాతంలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఆమె కోసం పోలీసులు గాలింపు చేపట్టగా.. చివరకు హైదరాబాద్‌ శివారులో ఓ సినీ నిర్మాత ఇంట్లో ఆమె ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఆమెను కస్టడీలోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపరిచారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *