కూర్చుని నవ్వుతారా?.. జగన్‌పై స్పీకర్‌ అసహనం

ఏపీ బడ్జెట్ సమావేశాలు (AP Budget Sessions 2025) రెండో రోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. ఈ సందర్భంగా సమావేశాల మొదటి రోజైన సోమవారం నాడు అసెంబ్లీలో వైస్సార్సీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్‌ ప్రసంగం సమయంలో వైస్సార్సీపీ (YSRCP) సభ్యులు వ్యవహరించిన తీరు సరికాదని హితవు పలికారు.

జగన్ విజ్ఞతతో వ్యవహరించాలి

‘రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి (వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan)ని ఉద్దేశిస్తూ) సభ్యత మరిచి ప్రవర్తించారు. తన పార్టీ సభ్యుల తీరును నియంత్రించాల్సింది పోయి ఆయన కూడా వాళ్లతో కలిసి కూర్చుని నవ్వుకుంటారా? రానున్న రోజుల్లో ఇలాంటివి జరగడానికి వీల్లేదు. ఇకనైనా జగన్‌ విజ్ఞతతో వ్యవహరించాలి. సభా మర్యాదను అందరు సభ్యులు కాపాడాలి.’ అని స్పీకర్ (AP Assembly Speaker) అయ్యన్నపాత్రుడు సూచించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *