USలో రోడ్డు ప్రమాదం.. ఏపీ విద్యార్థిని మృతి

అమెరికా (America)లో ఘోర రోడ్డు ప్రమాదం (Petal Road Accident) చోటు చేసుకుంది. కారు ఢీకొట్టడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థిని మృతి చెందింది. గుంటూరు జిల్లా (Guntur District)కు చెందిన దీప్తి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ (University Of North Texas)లో MS చదువుతోంది. గురువారం రాత్రి ఆమె రోడ్డుపై నడిచి వెళుతుండగా.. అతి వేగంగా వచ్చిన ఓ కారు ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో దీప్తి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. స్థానికంగా ఉన్న తెలుగు వారు ఈ సమాచారాన్ని ఇండియాలో ఉన్న మృతురాలి తల్లిదండ్రులకు అందజేశారు. కుమార్తె మృతి విషయం తెలిసిన దీప్తి తల్లిదండ్రులు బోరున విలపించారు. కాగా ఇటీవల కాలంలో విదేశాలలో ఉంటున్న భారతీయులు (Indians) ఎక్కువగా మరణిస్తుంటడటం ఆందోళన కలిగిస్తోంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *