అఖండ-2 అప్డేట్.. ఫస్ట్ సీన్​లోనే బాలయ్య క్రేజీ ఫైట్

Mana Enadu : సింహా, లెజెండ్(Legend), అఖండ సినిమాల తర్వాత నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న మూవీ ‘అఖండ 2(AKhanda 2)’. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా గ్రాండ్​గా లాంఛ్ అయిన విషయం తెలిసిందే.  షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న అప్డేట్ ఈ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేసింది. ఇంతకీ అదేంటంటే?

అమెరికాలో అఖండ-2 షూటింగ్

అఖండ-2 సినిమా స్టార్టింగ్ సీక్వెన్స్ గురించి నెట్టింట ఓ అప్డేట్ బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమా ఓపెనింగ్ సీన్ ను యూఎస్ లో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. అంది కూడా మూవీ ఓపెనింగ్ సీన్ లో బాలయ్య(Balakrishna Akhanda 2) సూపర్ యాక్షన్ చూపించనున్నాడట. అదేనండి.. మాంచి ఫైట్ తో ఈ చిత్రం ఓపెనింగ్ షాట్ ఉండనుందట. ఈ సీన్ షూటింగ్ కోసం బాలయ్య అమెరికా వెళ్లనున్నారట. అక్కడ తెలుగు వాళ్లపై దాడి జరిగే క్రమంలో బాలయ్య పాత్ర వారిని సేవ్ చేయడానికి ఈ ఫైట్ చేస్తారని టాక్ నడుస్తోంది. 

అఖండ2లో బాలీవుడ్ స్టార్

ఇక ‘అఖండ 2’ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్(Sanjay Dutt) కూడా ఓ కీలక పాత్రలో నటించనునన్నట్లు సమాచారం. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను  బాలయ్య రెండో కుమార్తె తేజస్విని సమర్పిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. 

గూస్ బంప్స్ తెప్పించే మ్యూజిక్

ఇక ఈ సినిమా పూజా కార్యక్రమం పూర్తైన కాసేపటికే​ ‘అఖండ 2’ టైటిల్ థీమ్​ను రిలీజ్ చేశారు. ఈ టైటిల్ థీమ్​కు తమన్(SS Thaman Music) సెన్సేషనల్ మ్యూజిక్ అందించారు. గూస్ బంప్స్ తెప్పించేలా ఈ మ్యూజిక్ ఉంది. ఇదే ఇలా ఉందంటే.. ఇక సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఏ రేంజులో ఉంటుందోనంటూ.. ఇక థియేటర్స్ లో పూనకాలే అంటూ బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *