కూలీగా మారిన భద్రాద్రి జిల్లా కలెక్టర్

నిత్యం ఆఫీసులో ఏసీ గదుల్లో కూర్చొని కార్యకలాపాలు నిర్వహించే కలెక్టర్ తాజాగా ప్రజల్లోకి వెళ్లారు. వారితో మాట్లాడుతూ వారి కష్టాలు తెలుసుకున్నారు. అంతేకాకుండా కూలీలతో కలిసి పలుగు పార పట్టి పనిలోకి దిగారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. అలా జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ (Bhadradri Collector) కూలీగా మారారు.

పలుగు పార పట్టిన కలెక్టర్

జిల్లాలోని టేకులపల్లి మండలంలో పలు గ్రామాల్లో కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రాంతానికి ఆయన వెళ్లారు. అక్కడ ఈజీఎస్ కూలీలతో కలిసి ఆయన పలుగు పార పట్టి మట్టి ఎత్తారు.

ఏసీ గది విడిచిన కలెక్టర్

దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో కలెక్టర్ ఉపాధి కూలీలతో ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇక ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లంతా ఏసీ గదుల్లోనే ఉంటారని, వారు బయట ప్రజల్లో తిరగాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కలెక్టర్లు ఏసీ గదులు విడిచి ప్రజల్లో తిరుగుతున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *