కూలీగా మారిన భద్రాద్రి జిల్లా కలెక్టర్

నిత్యం ఆఫీసులో ఏసీ గదుల్లో కూర్చొని కార్యకలాపాలు నిర్వహించే కలెక్టర్ తాజాగా ప్రజల్లోకి వెళ్లారు. వారితో మాట్లాడుతూ వారి కష్టాలు తెలుసుకున్నారు. అంతేకాకుండా కూలీలతో కలిసి పలుగు పార పట్టి పనిలోకి దిగారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. అలా జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ (Bhadradri Collector) కూలీగా మారారు.

పలుగు పార పట్టిన కలెక్టర్

జిల్లాలోని టేకులపల్లి మండలంలో పలు గ్రామాల్లో కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రాంతానికి ఆయన వెళ్లారు. అక్కడ ఈజీఎస్ కూలీలతో కలిసి ఆయన పలుగు పార పట్టి మట్టి ఎత్తారు.

ఏసీ గది విడిచిన కలెక్టర్

దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో కలెక్టర్ ఉపాధి కూలీలతో ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇక ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లంతా ఏసీ గదుల్లోనే ఉంటారని, వారు బయట ప్రజల్లో తిరగాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కలెక్టర్లు ఏసీ గదులు విడిచి ప్రజల్లో తిరుగుతున్నారు.

Related Posts

సొంతగడ్డపై సన్‘రైజర్స్’.. రాజస్థాన్‌పై 44 రన్స్‌ తేడాతో గ్రాండ్ విక్టరీ

ఐపీఎల్ రెండో మ్యాచ్‌లో సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) అదరగొట్టింది. ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌(RR)తో జరిగిన మ్యాచులో 44 పరుగుల తేడాతో గ్రాండ్ విజయం సాధించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచులో ఇరు జట్ల బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి…

Sikindar: ‘సికిందర్’ ట్రైలర్ రిలీజ్.. వింటేజ్ లుక్‌లో సల్మాన్‌భాయ్

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్(Salman Khan), ప్రముఖ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్(A.R. Murugadoss) కాంబోలో తెరకెక్కిన మూవీ ‘సికిందర్(Sikindar)’. ఈ మూవీలో సల్మాన్‌కు జోడీగా సక్సెస్‌ఫుల్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) నటిస్తోంది. సత్యరాజ్, కాజల్ అగర్వాల్(Kajal Agarwal)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *