Bhubharathi: నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘భూభారతి’ సదస్సులు

తెలంగాణలో నూతన రెవెన్యూ చట్టం ‘భూభారతి’ (Bhu Bhrathi) అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు (జూన్ 3) నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) వెల్లడించారు. గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల రైతులు(Farmers) భూ సమస్యల్లో చిక్కుకున్నారని మండిపడ్డారు. రెవెన్యూ వ్యవస్థలో ఆ రోజుల్లో జరిగిన తప్పిదాలను సరిదిద్ది, భూ పరిపాలనను ప్రజలకు సమీపంగా తీసుకెళ్తున్నామని చెప్పారు. ఈ లక్ష్యంతో ఏప్రిల్ 14న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భూభారతి చట్టాన్ని ప్రారంభించారని తెలిపారు.

త్వరలోనే 6 వేల సర్వేయర్లను నియామకం

పైలట్ ప్రాజెక్ట్‌గా జిల్లాకో మండలంలో ఈ చట్టాన్ని అమలు చేశామన్నారు. ఇప్పుడు జూన్ 3 నుంచి 20 వరకు ‘ప్రజల వద్దకే రెవెన్యూ’ నినాదంతో రాష్ట్రంలోని మిగిలిన మండలాల్లో సదస్సులు నిర్వహిస్తామని వివరించారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి తహశీల్దార్(MRO) నేతృత్వంలో ఒక బృందం వెళ్లి, ప్రజల నుంచి భూ సమస్యలపై దరఖాస్తులు(Applications on land issues) స్వీకరించి, వాటిని పరిష్కరిస్తుందని మంత్రి తెలిపారు. అలాగే రాబోయే రెండు నెలల్లో మొదటి దశలో 6,000 సర్వేయర్ల(Surveyors)ను నియమిస్తాం” అని ఆయన పేర్కొన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *