BJP బిగ్​షాక్​..కాంగ్రెస్​లోకి ఇద్దరు కీలకనేతలు

మన ఈనాడు:

భాజపా అధిష్టానం ఇచ్చిన MLA అభ్యర్ధి స్థానాలను తిరస్కరించిన వివేక్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధం అవుతున్నారని సమాచారం. కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి ఎల్బీ నగర్ నుంచి, ధర్మపురి నుంచి వివేక్ పోటీ చేయనున్నారని తెలుస్తోంది.

అందరూ అనుకున్నట్టుగానే వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డిలు బీజెపీలోంచి బయటకు వచ్చేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు. అంతేకాదు వీరిద్దరూ త్వరలో కాంగ్రెస్లో జాయిన్ అవుతారని కూడా చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి, వివేక్ అనుకున్న స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తున్నారని అందుకే వారిద్దరూ ఆ పార్టీలో జాయిన్ అవనున్నారని అంటున్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండు అసెంబ్లీ సీట్లు కోరారని సమాచారం. ఎల్ బీ నగర్ , మునుగోడు అసెంబ్లీ స్థానాలను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడిగారు. మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి తన భార్యను బరిలోకి దింపాలని రాజగోపాల్ రెడ్డి భావించారు. ఎల్ బీ నగర్ అసెంబ్లీ స్థానంనుండి పోటీ చేయాలని రాజగోపాల్ రెడ్డి అనుకున్నారని సమాచారం. అయితే బీజెపీ అందుకు ఒప్పుకోలేదని దానివల్లనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు తొలి జాబితాలో లేదని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. అలాగే వివేక్ వెంకటస్వామి చెన్నూరు, ధర్మపురి అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక స్థానం నుండి నుండి పోటీ చేయాలని డిసైడ్​ అయ్యారు. అయితే ఆయనకు చెన్నూరు అసెంబ్లీ కాకుండా ధర్మపురి అసెంబ్లీ స్థానం కావాలని వెంకటస్వామి కోరుకున్నట్టు సమాచారం. కానీ తొలి జాబితాలో ధర్మపురి అసెంబ్లీ స్థానం నుండి ఎస్. కుమార్ ను బీజేపీ బరిలోకి దింపింది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి ఎల్బీ నగర్ నుంచి వివేక్ ధర్మపురి నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

Related Posts

మహిళలకు బంపర్ ఆఫర్.. ఎవరు గెలిచినా నెలకు రూ.2,500

మరికొన్ని రోజుల్లో దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు (Delhi Assembly Elections 2025) జరగనున్నాయి. ఈసారి ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలకంగా మారారు. వారు మొగ్గు చూపే రాజకీయ పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో పలు…

రేవంత్.. నువ్వు మగాడివి అయితే నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో చర్చ పెట్టు: KTR

తెలంగాణలో ప్రస్తుతం చర్చంతా బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఫార్ముల ఈ రేస్ కేసు(Formula E race case)పైనే నడుస్తోంది. ఫార్ములా ఈ-రేస్‌ వ్యవహారంలో మంగళవారం గంటగంటకూ వ్యవహారం మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఇష్యూపై KTR మీడియాతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *