MSP for Crops: 14 పంటలకు మద్దతు ధరలు పెంచిన కేంద్రం 

కేంద్ర ప్రభుత్వం (central govt) రాబోయే ఖరీప్ సీజన్ కు సంబంధించి 14 పంటలకు మద్దతు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2025-26 ఖరీప్ సీజన్ కు సంబంధించి కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వరి క్వింటాలుపై రూ. 69 పెంచుతూ ఎమ్మాస్పీ ధర రూ. 2369 చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగానే మిగతా పంటలకు కూడా మద్దతు ధరలు పెంచుతున్నట్లు పేర్కొంది.

 

ఖరీప్ మార్కెటింగ్ సీజన్ నుంచి అమలు  

 

ఖరీప్ మార్కెటింగ్ సీజన్ లో కేంద్ర క్యాబినెట్ పెంచిన ధరలు (msp) అమలులోకి వస్తాయని తెలిపింది. దీని కోసం కేంద్రం ప్రభుత్వం రూ. 2.7 లక్షల కోట్లు కేటాయించినట్లు తెలిపింది. రైతులకు వడ్డీ రాయితీ కింద రూ. 15, 642 కోట్లు అందించనున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులకు కాస్త ఊరట లభించనుంది.

 

ఏ పంటకు ఎంత పెంచారంటే..

 

వరి సాధారణ, గ్రేడ్- ఏకి రూ.69 పెంచగా.. మొక్కజొన్న (corn) రూ.175, పెసర రూ.86, కందిపప్పు రూ.450, వేరుశెనగ రూ.480, పొద్దుతిరుగుడు రూ.441, మినుములు రూ.400, సజ్జలు రూ.150, జొన్నలు రూ. 328, రాగులు రూ.596, సోయాబీన్ (soya been) రూ.436, కుసుమలు రూ.579, పత్తి రూ.589 ఒలిసెలు రూ.820, చొప్పున కనీస మద్దతు ధరను పెంచారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *