ఉపఎన్నికలపై సీఎం రేవంత్ సంచలన కామెంట్స్

తెలంగాణలో ఉపఎన్నికల (Telangana By Elections)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో బై ఎలక్షన్స్ ఎందుకు వస్తాయని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పార్టీలు మారినప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎలా వస్తాయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)ను నిలదీశారు. తెలుగుదేశంలో ఉన్న తలసానిని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని మంత్రిని చేయలేదా ? అని అడిగారు. అప్పుడు ఆ కోర్టు, ఇప్పుడు అదే స్పీకర్ కాదా..? అని రేవంత్ కేసీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు.

మీరేం చేశారు?

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌లో పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ (CM Revanth Nizamabad Visit) పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ (KCR), ఆ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రం కోసం పోరాడిన పట్టభద్రుల కోసం కేసీఆర్‌ ఏం చేశారు..? పదేళ్లపాటు ఏమీ చేయని వారు.. ఇవాళ మమ్మల్ని తప్పుపడుతున్నారు. పదేళ్లపాటు నోటిఫికేషన్లు ఇవ్వలేదు. కాంగ్రెస్‌ సర్కార్ ఏడాదిలోనే 55,163 మందికి ఉద్యోగాలు ఇచ్చింది.’ అని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఎవరూ చేయని సాహసం చేశాం

26.50లక్షల మంది రైతులకు రూ.2లక్షల చొప్పున రుణమాఫీ చేశామన్న సీఎం రేవంత్.. సన్న వడ్లకు రూ.500 బోనస్‌ వచ్చి ఉంటే కాంగ్రెస్‌కు ఓటు వేయండని ఓటర్లను కోరారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను కేసీఆర్‌ రూ.7లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేశారని ఆరోపించారు. దేశంలో ఎవరూ చేయని సాహసాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిందని.. రాహుల్‌గాంధీ ఆశయం మేరకు రాష్ట్రంలో కులగణన సర్వే (Caste Census) పూర్తి చేశామని వెల్లడించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *