ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ

దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ (ఫిబ్రవరి 26వ తేదీ) ప్రధాని మోదీ (PM Modi)ని కలిశారు. పీఎంవో నుంచి సమాచారం రావడంతో ఆయన మంగళవారం రోజున హస్తినకు వెళ్లారు. గతేడాది జులైలో ప్రధానమంత్రితో సీఎం భేటీ అయిన విషయం తెలిసిందే. ఆరు నెలల తర్వాత ఇప్పుడు పీఎం అపాయింట్మెంట్ దొరికింది.

కేంద్రం సాయం కోరిన సీఎం

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో భేటీ అయిన రేవంత్.. ఆయనకు ఎస్ఎల్బీసీ ఘటన (SLBC Collapse Incident) గురించి వివరించారు. అలాగే పలు ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం సాయం గురించి మాట్లాడారు. మూసీ సుందరీకరణ, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో ప్రాజెక్టు (Shamshabad Airport Metro), రీజినల్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టుకు సాయంతో పాటు విభజన చట్టంలోని వివిధ పెండింగ్‌ సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి.

కేంద్రమంత్రులను కలిసే అవకాశం

ఇక మోదీతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్‌ అగ్ర నేతలను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలు, పీసీసీ రాష్ట్ర కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశాలున్నట్లు తెలిసింది. సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబుతో పాటు కొందరు అధికారులు ఉన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *