నేడు సీఎం రేవంత్ MLC ఎన్నికల ప్రచారం.. 3 జిల్లాల్లో సుడిగాలి పర్యటన

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం(MLC Election Campaign) నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఒక్కరోజే మూడు జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా నిజామాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 25న ప్రచారం ముగియనుండగా ఈరోజే ఆయా జిల్లాల్లో CM ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా MLC ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. ఈ మేరకు సీఎం షెడ్యూల్(CM Schedule) ఖరారైంది.

ముందుగా నిజామాబాద్‌లో ఎన్నికల ప్రచారం

ముందుగా ఉదయం 11 గంటలకు రేవంత్ హైదరాబాద్(HYD) నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి నిజామాబాద్‌కు 11:45 నిమిషాలకు చేరుకుంటారు. ఆయన ఉ.11:50 నుంచి మ.1:30 వరకు నిజామాబాద్ పట్టణంలో నిర్వహించే పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు. మ.1:35కి అక్కడి నుంచి బయల్దేరి మంచిర్యాల జిల్లాకు మ.2:15కు చేరుకొని అక్కడ నిర్వహించే పట్టభద్రుల ఆత్మియ సమ్మేళనంలో పాల్గొంటారు.

చివరగా కరీంనగర్ జిల్లాలో..

చివరగా కరీంనగర్(Karimnagar) జిల్లాలో SRR కళాశాల మైదానంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు కరీంనగర్‌లో పట్టభద్రుల ఓట్లు అభ్యర్థిస్తారు. ప్రజాపాలన వచ్చిన తర్వాత చేపట్టిన కార్యక్రమాలను వివరించి, పట్టభద్రులు ఆలోచించి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని సీఎం కోరనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యేలా చేస్తున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. కాగా, ఈ పర్యటనలో సీఎంతో పాటు TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పలువరు మంత్రులు, ఆయా జిల్లాల MLAలు కూడా హాజరు కానున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *