Lokesh Kanagaraj: ఆమిర్​ ఖాన్​తో బిగ్గెస్ట్​ యాక్షన్​ ఫిల్మ్​.. వెల్లడించిన లోకేశ్​ కనకరాజ్​

రజినీకాంత్​తో (Rajinikanth) ‘కూలీ’ (Coolie) సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు డైరెక్టర్​ లోకేశ్​ కనకరాజ్ (Lokesh Kanagaraj)​. షూటింగ్​ శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే లోకేశ్​ మరో భారీ ప్రాజెక్ట్​ను ప్రకటించారు. బాలీవుడ్ టాప్​ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan)తో ఓ సినిమా చేయనున్నట్లు వెల్లడించారు. ఇండియన్ సినిమా ఆడియన్స్​ను మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించేలా బిగ్గెస్ట్​ యాక్షన్​ ఫిల్మ్​ను రూపొందించనున్నట్లు తెలిపారు. ఓ యూట్యూబ్ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. రజినీకాంత్​తో కూలీ (Coolie),తోపాటు తన తర్వాతి మూవీల గురించి కూడా చెప్పారు.

ట్రైలర్​తోనే ప్రమోషన్స్ చాలు అనుకుంటున్నా..

‘కూలీ కమర్షియల్ మూవీ అయినప్పటికీ ఇందులో ఎమోషన్​ ఎక్కువగా ఉంటుంది. మరోవైపు రజనీకాంత్ యాక్షన్​ ఉంటుంది. ట్రైలర్ విడుదలయ్యే వరకూ ఇందులో నటించిన హీరోల లుక్స్ రివీల్ చేసే ఉద్దేశం లేదు. ట్రలర్​ను ఆగస్టు 2న రిలీజ్ చేస్తాం. ఒక్క ట్రైలర్​తోనే ప్రమోషన్స్ చాలు అనుకుంటున్నా. నాగార్జున (Nagarjuna) సర్ తన కెరీర్ లోనే ఇప్పటివరకూ నటించని క్యారెక్టర్​ ఇందులో చేస్తున్నారు. ఆయనను ఒప్పించేందుకు నాకు చాలా సమయం పట్టింది’ అనిని పేర్కొన్నారు.

వారి డేట్స్​ ఎప్పుడు దొరికితే అప్పుడు ఆ సీక్వెల్స్​ చేస్తా..

మూవీలో ఓ పాత్ర కోసం ఫహాద్ ఫాజిల్​ను అనుకున్నాని కానీ, ఆయన బిజీగా ఉండడంతో ఆ రోల్​కు సౌబిన్ షాహిర్​ను ఎంపిక చేసినట్లు చెప్పారు. కూలీ తర్వాత కార్తీతో ఖైదీ 2 చేస్తానని, ఆ తర్వాత ఆమిర్​ సినిమా చేసే అవకాశం ఉందన్నారు. సూర్యతో ‘రోలెక్స్’​, కమల్​ హాసన్​తో ‘విక్రమ్​ 2’, విజయ్​తో మాస్టర్​ 2, లియో 2 చేస్తానన్నారు. అయితే ఆ హీరోల డేట్స్ ఎప్పుడు దొరికితే అప్పుడు చేస్తానని తెలిపారు. కూలీ మూవీని లోకేశ్​ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర, శ్రుతిహాసన్, సత్యరాజ్ తదితరులు కూడా కీలక రోల్స్​ పోషించారు. సినిమాను ఆగస్టు 14న రిలీజ్​ చేయనున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *