15కి పైగా హత్యలకు అతడే కారణమా?

మన ఈనాడు: సరిగ్గా 3ఏళ్ల క్రితం వనపర్తి జిల్లాలో జరిగిన నలుగురు కుటుంబ సభ్యుల హత్య మిస్టరీ వీడింది. అందరూ ఊహించినట్లే తాంత్రిక పూజలకే నలుగురు బలయ్యారు. పూజల పేరుతో అమాయకులను బలి తీసుకున్న నరహంతకుడుని ఎట్టకేలకు పోలీసులు ఆదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మూడేళ్ల క్రితం వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ లో నలుగురు కుటుంబ సభ్యులు విగత జీవులుగా మృత్యువాత ఘటన రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది.

నిందితుడు గుప్త నిధుల పేరుతో మూడు రాష్ట్రాల్లో హత్యలకు పాల్పడ్డట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణలో వనపర్తి జిల్లాలో, కర్ణాటకలోని రాయచూర్, ఏపీలోని అనంతపురంలోనూ ఇదే తరహా ఘటనల్లో సత్యం యాదవ్ నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మూడు రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 15మందికి పైగా హత్యలకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు.

అమాయకులే టార్గెట్ గా తాంత్రిక పూజలు, హత్యలు..
తాంత్రిక పూజలు చేస్తున్నాడని మొదటి నుంచి సత్యం యాదవ్ పై ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఓ జాతీయ పార్టీ నుంచి కౌన్సిలర్ గా పోటి చేశాడు. విషయం తెలుసుకున్న సదరు పార్టీ నాయకత్వం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే తన ప్రవృత్తిని మాత్రం వీడలేదు. అమాయకులను గుప్త నిధులు ఉన్నాయని పూజలు చేస్తే అపార సంపద మీ సొంతం అవుతుందని నమ్మిస్తాడు. ఆ తర్వాత పూజలు చేసినందుకు తనకు భారీగా డబ్బు లేదా భూములు ఇవ్వాలని కోరతాడు. సంపదకు ఆశపడ్డ బాధితులు కోరినట్లుగా సత్యం యాదవ్ కు మూట చెప్పేవారు. అనంతరం నెలల తరబడి బాధితులకు చిక్కకుండా తిరిగేవాడు. ఎవరైతే తీవ్ర ఒత్తిడి తెస్తారో వాళ్లను అదే తాంత్రిక పూజల పేరుతో హత్యకు పాల్పడతాడని తెలుస్తోంది. తీర్థం రూపంలో పానీయం ఇచ్చి మిస్టరీగా హత మార్చుతాడు. ఇంత జరిగిన ఎక్కడ కూడా ఆధారాలు వదలడు ఈ మాయలమారీ.

మొదటి నుంచి సత్యమే నిందితుడు అని చెబుతున్నామని బాధితుల కుటుంబ సభ్యుడు కరీం పాషా తెలిపారు. ఉద్దేశ్యపూర్వకంగానే పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. గుప్త నిధులు ఉన్నాయని పూజలు చేయాలని తమ కుటుంబ సభ్యులను నమ్మించాడని చెప్పాడు. పూజలు చేసినందుకు ప్లాట్ కూడా రాయించుకున్నాడని కరీం తెలిపాడు.

15కి పైగా హత్యలకు అతడే కారణమా?
నిందితుడు గుప్త నిధుల పేరుతో మూడు రాష్ట్రాల్లో హత్యలకు పాల్పడ్డట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణలో వనపర్తి జిల్లాలో, కర్ణాటకలోని రాయచూర్, ఏపీలోని అనంతపురంలోనూ ఇదే తరహా ఘటనల్లో సత్యం యాదవ్ నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మూడు రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 15మందికి పైగా హత్యలకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు.

Related Posts

Fish Venkat: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ (Fish Venkat) శుక్రవారం (జులై 18) రాత్రి కన్నుమూశారు. 53 ఏళ్ల ఆయన అసలు పేరు మంగిలంపల్లి వెంకటేశ్. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం(serious illness)తో…

Air India plane Crash: ఎయిరిండియా విమాన ప్రమాదంపై నిరాధార ఆరోపణలు చేయొద్దు: AAIB

అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద ఘటన(Air India plane Crash Incident)పై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఇచ్చిన నివేదిక(Report)పై విభిన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏఏఐబీ స్పందించింది. ఈ ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని, దీనిపై…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *