DC vs RR: వాట్ ఏ మ్యాచ్.. సూపర్ ఓవర్లో ఢిల్లీ థ్రిల్లింగ్ విక్టరీ

IPL 2025 సీజన్‌లో ఫస్ట్ సూపర్ ఓవర్(Super Over) మ్యాచ్ జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్(DC vs RR) మధ్య జరిగిన మ్యాచ్ టై అవ్వడంతో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. సూపర్ ఓవర్లో ఢిల్లీ థ్ల్రిల్లింగ్ విక్టరీ సాధించింది. RR నిర్దేశించిన 12 పరుగులను ఛేజ్ చేసింది. మొదట రాజస్థాన్ బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు నుంచి హిట్మేయర్, కెప్టెన్ రియాన్ పరాగ్ బరిలోకి దిగారు. ఢిల్లీ నుంచి మిచెల్ స్టార్క్(Mitchel Starc) బౌలింగ్ వేశాడు. అనంతరం RR తరఫున సందీప్ శర్మ బౌలింగ్ వేయగా ఢిల్లీ బ్యాటర్లు KL రాహుల్, స్టబ్స్ 4 బంతుల్లోనే టార్గెట్‌ను పూర్తి చేశారు.

Image

టాస్ గెలిచిన రాజస్థాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆచితూచి ఆడింది. అభిషేక్ పొరెల్ (49), కేఎల్ రాహుల్ (38), అక్షర్ పటేల్ (34), ట్రిస్టన్ స్టబ్స్(34 నాటౌట్) రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు సాధించింది. RR బౌలర్లలో ఆర్చర్ రెండు, తీక్షణ, హసరంగా చెరోవికెట్ పడగొట్టారు.

Image

సూపర్ ‌ఓవర్లో రెండు రనౌట్లు

ఇక 189 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు వచ్చిన RR ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(51), సంజూ శామ్సన్ (31), నితీష్ రానా (51) పరుగుల వర్షం కురిపించడంతో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసి స్కోర్ టై చేశారు. DC బౌలర్లలో స్టార్క్, అక్షర్, కుల్దీప్ తలో వికెట్ తీశారు. దీంతో సూపర్ ఓవర్‌కు వెళ్లింది. ఇక సూపర్ ఓవర్‌లో డ్రామా క్రియేట్ అయ్యింది. సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. ఐదు బంతుల్లోనే 2 వికెట్లు కోల్పోయి 11 పరుగులు మాత్రమే సాధించింది. ఇద్దరు బ్యాటర్లు రనౌట్ అవడం గమనార్హం. అటుపై బ్యాటింగ్‌కు వచ్చిన ఢిల్లీ 13 పరుగులతో విజయాన్ని అందుకుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *