
IPL 2025 సీజన్లో ఫస్ట్ సూపర్ ఓవర్(Super Over) మ్యాచ్ జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్(DC vs RR) మధ్య జరిగిన మ్యాచ్ టై అవ్వడంతో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. సూపర్ ఓవర్లో ఢిల్లీ థ్ల్రిల్లింగ్ విక్టరీ సాధించింది. RR నిర్దేశించిన 12 పరుగులను ఛేజ్ చేసింది. మొదట రాజస్థాన్ బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు నుంచి హిట్మేయర్, కెప్టెన్ రియాన్ పరాగ్ బరిలోకి దిగారు. ఢిల్లీ నుంచి మిచెల్ స్టార్క్(Mitchel Starc) బౌలింగ్ వేశాడు. అనంతరం RR తరఫున సందీప్ శర్మ బౌలింగ్ వేయగా ఢిల్లీ బ్యాటర్లు KL రాహుల్, స్టబ్స్ 4 బంతుల్లోనే టార్గెట్ను పూర్తి చేశారు.
టాస్ గెలిచిన రాజస్థాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆచితూచి ఆడింది. అభిషేక్ పొరెల్ (49), కేఎల్ రాహుల్ (38), అక్షర్ పటేల్ (34), ట్రిస్టన్ స్టబ్స్(34 నాటౌట్) రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు సాధించింది. RR బౌలర్లలో ఆర్చర్ రెండు, తీక్షణ, హసరంగా చెరోవికెట్ పడగొట్టారు.
సూపర్ ఓవర్లో రెండు రనౌట్లు
ఇక 189 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు వచ్చిన RR ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(51), సంజూ శామ్సన్ (31), నితీష్ రానా (51) పరుగుల వర్షం కురిపించడంతో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసి స్కోర్ టై చేశారు. DC బౌలర్లలో స్టార్క్, అక్షర్, కుల్దీప్ తలో వికెట్ తీశారు. దీంతో సూపర్ ఓవర్కు వెళ్లింది. ఇక సూపర్ ఓవర్లో డ్రామా క్రియేట్ అయ్యింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. ఐదు బంతుల్లోనే 2 వికెట్లు కోల్పోయి 11 పరుగులు మాత్రమే సాధించింది. ఇద్దరు బ్యాటర్లు రనౌట్ అవడం గమనార్హం. అటుపై బ్యాటింగ్కు వచ్చిన ఢిల్లీ 13 పరుగులతో విజయాన్ని అందుకుంది.
What a Match💀💥#DCvsRR #SuperOver pic.twitter.com/xWbvklJ50B
— Rahul (@raahuull_) April 16, 2025