BREAKING: సూపర్‌స్టార్ మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు.. ఎందుకంటే?

సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu)కు ఈడీ అధికారులు నోటీసులు(ED Notice) పంపారు. సురానా గ్రూప్(Surana Group), సాయి సూర్య డెవలపర్ల(Sai Surya Developers)కు సంబంధించిన వ్యవహారంలో ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈనెల 27న విచారణ(investigation)కు రావాలని అందులో పేర్కొన్నారు. ఈ రెండు గ్రూపులకు మహేశ్ బాబు ప్రమోషన్స్(Promotions) చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు ఆయన దాదాపు 3.4 కోట్లు తీసుకున్నట్లు ED గుర్తించింనట్లు సమాచారం.

కాగా ఇటీవల సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్లలో ఈడీ సోదాలు(ED Searches) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో భారీగా నగదు పట్టుబడింది. దీంతో ఆ కంపెనీల బ్యాంకు ఖాతాలు, లావాదేవీలపై ఈడీ ఫోకస్ చేసింది. అందులో భాగంగానే మహేశ్ బాబుకు నోటీసులు అందజేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం మహేశ్ బాబు డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Related Posts

Hyderabad Metro: పెరిగిన హైదరాబాద్ మెట్రో ఛార్జీలు

హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరిగాయి. కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి, గరిష్ఠా ఛార్జీ రూ.60 నుంచి రూ.75కు పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ గురువారం ప్రకటించింది. పెంచిన ధరలు ఈ నెల 17 నుంచి అమలు కానున్నట్లు…

Bellamkonda Srinivas: హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై (Bellamkonda Srinivas) కేసు నమోదైంది. రాంగ్ రూట్‌లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీస్తో శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు బుక్ అయ్యింది. ఈనెల 13న జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *