BREAKING: సూపర్‌స్టార్ మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు.. ఎందుకంటే?

సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu)కు ఈడీ అధికారులు నోటీసులు(ED Notice) పంపారు. సురానా గ్రూప్(Surana Group), సాయి సూర్య డెవలపర్ల(Sai Surya Developers)కు సంబంధించిన వ్యవహారంలో ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈనెల 27న విచారణ(investigation)కు రావాలని అందులో పేర్కొన్నారు. ఈ రెండు గ్రూపులకు మహేశ్ బాబు ప్రమోషన్స్(Promotions) చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు ఆయన దాదాపు 3.4 కోట్లు తీసుకున్నట్లు ED గుర్తించింనట్లు సమాచారం.

కాగా ఇటీవల సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్లలో ఈడీ సోదాలు(ED Searches) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో భారీగా నగదు పట్టుబడింది. దీంతో ఆ కంపెనీల బ్యాంకు ఖాతాలు, లావాదేవీలపై ఈడీ ఫోకస్ చేసింది. అందులో భాగంగానే మహేశ్ బాబుకు నోటీసులు అందజేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం మహేశ్ బాబు డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *