Mana Enadu: బాలీవుడ్కు పాలిటిక్స్కు అవినాభావ సంబంధం ఉంది. ఈ సినిమా ఇండస్ట్రీలో నటించిన చాలా మంది నటులు రాజకీయాల్లో రాణిస్తున్నారు. కొంత మంది రాజకీయ నాయకులేమో ఈ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లను పెళ్లాడుతున్నారు. ఇటీవలే ఆప్ ఎంపీ రాఘవ్ చద్ధా హీరోయిన్ పరిణీతి చోప్రాను వివాహ మాడిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఓ మాజీ ముఖ్యమంత్రి మనవడు కూడా బాలీవుడ్ బ్యూటీతో ప్రేమలో పడ్డాడట. అయితే హీరోయిన్లతో ప్రేమాయణం ఇతనికి కొత్తేం కాదు. గతంలోనూ ఓ స్టార్ హీరో కుమార్తె, ఇప్పుడు స్టార్ హీరోయిన్తో ప్రేమాయణం సాగించాడు. ఆమెతో బ్రేకప్ తర్వాత తాజాగా మరో భామతో లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్టు సోషల్ మీడియాలో న్యూస్ బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరతను? ఇతగాడి ప్రేమలో పడ్డ ఆ భామలెవరు?
ఎవరి వీర్ పహారియా?
మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు (కూతురి కుమారుడు) వీర్ పహారియా. వీర్ గతంలో సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్తో ప్రేమాయణం నడిపాడు. కొన్నేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్న ఈ జంట ఏవో కారణాలతో విడిపోయారు. అయితే అప్పుడు సారా ఇంకా హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వలేదు. ఇక బ్రేకప్ తర్వాత ఈ ఇద్దరూ తమ లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయారు.
వీర్ – సారా లవ్ స్టోరీ?
వీర్-సారా స్టోరీ కంప్లీట్గా ఎండ్ అయిపోయింది అనుకుంటున్న తరుణంలో ఇటీవల అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ వివాహ వేడుకలో ఈ జంట కలిసి కనిపించడమే కాకుండా డ్యాన్స్ కూడా చేసింది. మళ్లీ ప్యాచప్ అయిందేమో అనుకుంటుంటే బాలీవుడ్ పాపులర్ సెలబ్రిటీ ఓరీ ఇటీవల పోస్టు చేసిన ఓ వీడియోతో వీర్ పహారియా కరెంట్ గర్ల్ఫ్రెండ్ సారా కాదని, మరో బాలీవుడ్ బ్యూటీ మానుషీ చిల్లర్(Manushi Chhillar) అని తేలిపోయింది.
‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీతో తెలుగువారికి పరిచయమైన మాజీ మిస్ యూనివర్స్, బాలీవుడ్ బ్యూటీ మానుషి చిల్లర్ వీర్ పహారియాతో ప్రేమలో ఉన్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఓరీ ఇటీవల తాను తన ఫ్రెండ్స్తో కలిసి టూర్కు వెళ్లిన ఓ వీడియో షేర్ చేశాడు. ఆ వీడియోలో మానుషి, వీర్ కలిసి కనిపించారు. వీర్ భుజంపై ఆమె సేదతీరుతూ కనిపించడం ఇప్పుడు వైరల్గా మారింది. దీంతో మానుషి వీర్ డేటింగ్లో ఉన్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పుకార్లపై ఈ ఇద్దరు క్లారిటీ ఇవ్వలేదు.
మానుషి చిల్లర్.. 2017లో మిస్ యూనివర్స్గా గెలిచింది. అనంతరం ఆమె బాలీవుడ్లో అక్షయ్కుమార్ హీరోగా నటించిన ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’, ‘బడే మియా ఛోటే మియా’ చిత్రాల్లో నటించింది. ఇటీవల ఆపరేషన్ వాలెంటైన్లో వరుణ్ తేజ్ సరసన సందడి చేసింది. ప్రస్తుతం జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కుతోన్న ‘టెహ్రాన్’ కోసం వర్క్ చేస్తోంది.