ఏఐజీ ఆస్పత్రికి మాజీ సీఎం కేసీఆర్‌

బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఆస్పత్రికి వెళ్లారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ (KCR At AIG Hospital) ఆస్పత్రికి వెళ్లిన ఆయన.. సాధారణ పరీక్షల కోసం ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన తిరిగి ఇంటికి చేరుకోనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక బుధవారం రోజున ఆయన సికింద్రాబాద్ పాస్ పోర్టు కార్యాలయానికి వెళ్లిన విషయం తెలిసిందే.

ఏడు నెలల తర్వాత 

ఇక ఏడు నెలల తర్వాత బుధవారం రోజున మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ (Telangana Bhavan) కు వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంపై మాట్లాడారు. తప్పకుండా తెలంగాణలో ఉపఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. త్వరలోనే మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

మళ్లీ అధికారంలోకి వస్తాం

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. “పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్లీ వెనక్కిపోతోంది. పాతికేళ్ల స్ఫూర్తితో మళ్లీ రాష్ట్రాన్ని నిలబెట్టుకునేందుకు, ప్రజల కోసం పోరాటం చేయాలి. ప్రజల కష్టాలు బీఆర్​ఎస్​కు మాత్రమే తెలుసు. ఒక్కసారి ఓటమికే కొట్టుకుపోయే పార్టీ బీఆర్ఎస్ కాదు. వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తాం. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తాం.” అని కేసీఆర్ అన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *