JEE Mains: వారెవ్వా.. ఒకే గ్రామంలో 40మందికిపైగా మెయిన్స్‌ ర్యాంకులు

భారత్‌లో నిర్వహించే ప్రవేశ పరీక్షలలో అత్యంత టఫ్ ఎగ్జామ్ జేఈఈ మెయిన్స్(JEE Mains) ఒకటి. చాలా మంది విద్యార్థులు ఇందులో ర్యాంక్ కొట్టి ప్రతిష్టాత్మక NIT, IIT, IIITల్లో సీటు దక్కించుకోవాలని ఉవ్విళూరుతుంటారు. కానీ చాలా మంది కనీసం పాస్ అయ్యేందుకే తీవ్రంగా కష్టపండుతుంటారు. ఎందుకంటే అంత కఠినంగా ఉంటుంది ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్(Entrance Exam). దేశ వ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్ష ఏడాదికి రెండు సార్లు నిర్వహించినా పాస్ పర్సంటేజీ మాత్రం అంతంత మాత్రమే. దీంతో సాధారణంగా ఒక రాష్ట్రంలో ఇందులో సీటు సంపాదించే వారి సంఖ్య దాదాపు వందలోపే ఉంటుంది. అలాంటిది ఓ మారుమూల గ్రామంలో ఏకంగా 40 మందికిపైగా విద్యార్థులు ఇటీవల వెల్లడైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుందో తెలుసుకుందామా..

28 మంది ఆ కోచింగ్‌ సెంటర్ నుంచే..

ఇటీవల జేఈఈ మెయిన్స్‌ ఫలితాలు(JEE Mains Results) విడుదలైన సంగతి తెలిసిందే. కనీస కటాఫ్‌ స్కోర్ సాధించిన 2,50,236 మంది విద్యార్థులు.. జేఈఈ అడ్వాన్స్‌డ్(JEE Advanced 2025) పరీక్ష రాయనున్నారు. అయితే దీనికి క్వాలిఫై అయిన వాళ్లలో 40 మందికి పైగా విద్యార్థులు ఒకే గ్రామానికి చెందినవారు కావడం విశేషం. బిహార్‌(Bihar)లోని గయ అనే జిల్లాలో ఐఐటీ విలేజ్‌గా పేరుపొందిన పఠ్వాఠోలీ(Patwatoli) నుంచి వాళ్లందరూ ఉత్తీర్ణత సాధించారు. వీళ్లలో 28 మంది వృక్ష సంస్థాన్‌ కోచింగ్‌ సెంటర్ నుంచి శిక్షణ పొందిన వారు కావడం గమనార్హం.

ఐఐటీ చదవాలనుకునేవాళ్లకి ఫ్రీ కోచింగ్

1991లోనే పఠ్వాఠోలీ(Patwatoli)కి ఐఐటీ వీలేజ్‌గా పేరు పొందడానికి బీజం పడింది. ఈ గ్రామం నుంచి 1991లో మొదటిసారిగా జితేంద్ర పఠ్వా(Jithendra Patwa) అనే అతను ఐఐటీలో సీటు సాధించారు. ఆ తర్వాత జితేంద్ర మంచి ఉద్యోగం సంపాదించారు. US వెళ్లిపోయారు. తనలాగే మిగతావారు కూడా ఎదగాలని Vriksh We The Change అనే పేరుతో ఓ NGOను స్థాపించారు. అప్పటినుంచి ఆ ఊరిలో ప్రతి ఇంట్లో కూడా ఐఐటీ పదం వినిపిస్తోంది. ఒకప్పుడు వస్త్ర పరిశ్రమలు, చేనేత పని చేసుకునేవాళ్లు ఎక్కువగా ఉండే ఈ గ్రామంలో ప్రస్తుతం ఇంజినీర్లకు నిలయంగా మారిపోయింది. 2013లో ప్రారంభమైన వృక్ష సంస్థాన్‌లో ఐఐటీ చదవాలనుకునేవాళ్లకి ఫ్రీగా కోచింగ్ ఇస్తుండటం విశేషం.

Related Posts

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు గడువు పెంపు

ఏపీ(Andhra Prsadesh)లోని రాష్ట్రంలోని విద్యార్థులకు(Inter Students) ఇంటర్ బోర్డు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ(Intermediate Public Advanced Supplementary Exams) పరీక్షల కోసం పరీక్ష ఫీజు(Fee) చెల్లింపు గడువు తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే.…

TG 10th Results: విద్యార్థలకు అలర్ట్.. రేపే పదో తరగతి ఫలితాలు!

తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు(TG 10th Class Results) రేపు మధ్యాహ్నం (ఏప్రిల్ 30) ఒంటిగంటకు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విడుదలచేయనున్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ పదో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *