oparation sindoor: ఇకపై తూటాకు తూటాతోనే సమాధానం ఇస్తాం: ప్రధాని మోదీ

పాకిస్థాన్ పై ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) మరోసారి నిప్పులు చెరిగాడు. పాక్ ఉగ్రవాదాన్ని ఆయుధంగా ఉపయోగించి భారత్ పై యుద్ధం చేస్తోందని విమర్శించారు. గుజరాత్ (Gujarat) లోని గాంధీనగర్ లో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పాక్ కు తీవ్ర హెచ్చరికలు పంపారు. 75 సంవత్సరాలుగా పర్యాటకులు, యాత్రికులు, సాధారణ పౌరులు ఎందరిపైనో దాడులు చేశారు. అయినా తట్టుకున్నాం. ఇక నుంచి ఉపేక్షించేది లేదు. ఇక మాట మాటకు మాట.. తూటాకు తూటా అని అన్నారు.పాక్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తుందన్నారు. అయినా ఎప్పటికప్పుడు ఉగ్రవాదులను మట్టుబెడుతున్నామన్నారు.

 

దాడికి ప్రతి దాడి చేస్తాం..

 

75 ఏళ్ల భారత స్వాతంత్య్రంలో ఎన్నో సార్లు మాపై దాడులు చేసినా మేం తట్టుకున్నాం. ఇక నుంచి దాడికి ప్రతి దాడి కచ్చితంగా ఉంటుందని హెచ్చరించారు. ఇలాంటి ఉగ్రదాడులు చేస్తుంటే ఇంకా తట్టుకోవాలా అని ప్రజలను ప్రశ్నించారు. ఇండియా శాంతిని కోరుకుంటుందని కానీ పదే పదే రెచ్చగొడితే మాత్రం ప్రతీకారం తప్పదన్నారు. భారతదేశం శాంతిని కోరుకుంటుందని ఒక వేళ మా సహనాన్ని పరీక్షిస్తే దేశం యోధుల భూమి అని ప్రపంచానికి మళ్లీ గుర్తుచేయాల్సిన అవసరం వస్తుందన్నారు.

 

పాక్ రాడార్లు, ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం..

 

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లో (jammu and Kashmir) ని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పౌరులు చనిపోవడంతో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి మే 7న చేసిన దాడుల్లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశారు. భారత దాడులకు ప్రతిగా పాక్ డ్రోన్‌లు, క్షిపణులతో భారత సైన్యం పౌర ప్రాంతాలపై దాడి చేసింది. వైమానిక దాడులతో పాక్ విమాన స్థావరాలను, ఎయిర్ డిఫెన్స్ రాడార్లను లక్ష్యంగా చేసుకుంది. తర్వాత పాక్ శాంతికి మొగ్గుచూపింది. మే 12న కాల్పుల విరమణను ప్రకటించారు.ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, విపక్ష నాయకులు భారత సైనిక దళాలను అభినందించారు. పహల్గామ్ ఉగ్రదాడికి సమర్థవంతంగా ప్రతీకారం తీర్చుకున్నారని పాక్ క్షిపణి దాడులను విజయవంతంగా తిప్పికొట్టారని ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్ (Operation sindoor)తో ప్రజల్లో దేశ భక్తి కనిపించిందన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *