రజాకర్ల పాలనకు బీజేపీతోనే విముక్తి

హైదరాబాద్​: గిరిజన వర్శిటీ తెలంగాణా రాష్ర్టంలో ఏర్పాటు చెయ్యాలని 10ఏళ్లుగా మోదీ ప్రయత్నిస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం స్థలం ఇవ్వడం లేదని అమిత్​షా ఆరోపించారు . తెలంగాణలో రజాకర్ల పోకడలు పోలేదని ఘాటగా విమర్శలు చేశారు. ఈనాటి రజాకార్ల నుంచి తెలంగాణను కాపాడేది ఒక్క భారతీయ జనతా పార్టీకి మాత్రమే సాధ్యమన్నారు. రాష్ర్టానికి వారసుడిని సీఎం చెయ్యడమే లక్ష్యంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. 2014 నుంచి సీఎం అదే పనిలో ఉన్నారని విమర్శలు గుప్పించారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్‌ సర్కార్ కావాలన్నారు షా. ఇంతకీ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటో తెలుసా అని అడిగి మరీ ఆయనో క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 3న తెలంగాణలో ఎగరబోయేది బీజేపీ జెండానే అన్నారు అమిత్‌ షా. ఆదిలాబాద్ సభలో ఆ ధీమా వ్యక్తం చేశారు.

* విమోచన దినోత్సవం అధికారికంగా చేస్తాం:

భారతీయ జనతాపార్టీ అధికారంలోకి రావడంతోనే ప్రతి జిల్లాలో తెలంగాణ విమోచనా దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తామని కేంద్రమంత్రి అమిత్ షా ప్రకటించారు. గిరిజనులకు మూడు ఎకరాల భూమితోపాటు రూ. 10 లక్షల దళిత బంధు హామీలు ఏమయ్యాయంటూ సీఎం కేసీఆర్ పై అమిత్​షా విమర్శల వర్షం గుప్పించారు.

Related Posts

Khammam|కార‌ణం తెలియ‌దు కానీ..ఖ‌మ్మం ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌రం

ఖ‌మ్మం ప‌త్తి మార్కెట్లో అగ్నిప్ర‌మాదం జ‌ర‌గ‌డానికి త‌న‌కి ఇంకా కార‌ణం తెలియ‌దు కానీ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌రమ‌ని వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు అన్నారు. జిల్లా క‌లెక్ట‌ర్‌, పోలీస్ క‌మిష‌న‌ర్‌తో క‌లిసి గురువారం ఖ‌మ్మం ప‌త్తి మార్కెట్లో ప్ర‌మాదం జ‌రిగిన తీరును…

BIG BREAKING: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దుండగుల దాడి

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‌(Saif Ali Khan)పై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ముంబై(Mumbai)లోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగులు ఇవాళ తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఆయనపై కత్తితో అటాక్(Knife Attack) చేశారు. ఈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *