రజాకర్ల పాలనకు బీజేపీతోనే విముక్తి

హైదరాబాద్​: గిరిజన వర్శిటీ తెలంగాణా రాష్ర్టంలో ఏర్పాటు చెయ్యాలని 10ఏళ్లుగా మోదీ ప్రయత్నిస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం స్థలం ఇవ్వడం లేదని అమిత్​షా ఆరోపించారు . తెలంగాణలో రజాకర్ల పోకడలు పోలేదని ఘాటగా విమర్శలు చేశారు. ఈనాటి రజాకార్ల నుంచి తెలంగాణను కాపాడేది ఒక్క భారతీయ జనతా పార్టీకి మాత్రమే సాధ్యమన్నారు. రాష్ర్టానికి వారసుడిని సీఎం చెయ్యడమే లక్ష్యంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. 2014 నుంచి సీఎం అదే పనిలో ఉన్నారని విమర్శలు గుప్పించారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్‌ సర్కార్ కావాలన్నారు షా. ఇంతకీ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటో తెలుసా అని అడిగి మరీ ఆయనో క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 3న తెలంగాణలో ఎగరబోయేది బీజేపీ జెండానే అన్నారు అమిత్‌ షా. ఆదిలాబాద్ సభలో ఆ ధీమా వ్యక్తం చేశారు.

* విమోచన దినోత్సవం అధికారికంగా చేస్తాం:

భారతీయ జనతాపార్టీ అధికారంలోకి రావడంతోనే ప్రతి జిల్లాలో తెలంగాణ విమోచనా దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తామని కేంద్రమంత్రి అమిత్ షా ప్రకటించారు. గిరిజనులకు మూడు ఎకరాల భూమితోపాటు రూ. 10 లక్షల దళిత బంధు హామీలు ఏమయ్యాయంటూ సీఎం కేసీఆర్ పై అమిత్​షా విమర్శల వర్షం గుప్పించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *