విద్యార్థులకు గుడ్​న్యూస్.. ఈనెల 15 నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణలో రోజురోజుకు ఎండ తీవ్రత (Summer News) పెరుగుతోంది. ఫిబ్రవరి నెల చివరి వారంలోనే ఎండలు మండిపోయాయి. ఇక మార్చి నెల మొదలైన తర్వాత భానుడి భగభగలు మరింత తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది.  వేసవి కాలం నేపథ్యంలో ఒంటిపూట బడులు (Half Day School) నిర్వహించాలని నిర్ణయించింది.

మార్చి 15 నుంచి ఒంటిపూట బడి

ఇందులో భాగంగా ఈనెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నట్లు తెలిపింది. ఈ విద్యా సంవత్సరం ముగిసే వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నట్లు వెల్లడించింది. ఒంటిపూట బడులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 (Half Day School Timings) వరకు పని చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. మరోవైపు పదో తరగతి పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో ఒంటి గంట నుంచి సాయంత్రం 5 వరకు తరగతులు జరగనున్నట్లు వివరించింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *