విద్యార్థులకు గుడ్​న్యూస్.. ఈనెల 15 నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణలో రోజురోజుకు ఎండ తీవ్రత (Summer News) పెరుగుతోంది. ఫిబ్రవరి నెల చివరి వారంలోనే ఎండలు మండిపోయాయి. ఇక మార్చి నెల మొదలైన తర్వాత భానుడి భగభగలు మరింత తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది.  వేసవి కాలం నేపథ్యంలో ఒంటిపూట బడులు (Half Day School) నిర్వహించాలని నిర్ణయించింది.

మార్చి 15 నుంచి ఒంటిపూట బడి

ఇందులో భాగంగా ఈనెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నట్లు తెలిపింది. ఈ విద్యా సంవత్సరం ముగిసే వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నట్లు వెల్లడించింది. ఒంటిపూట బడులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 (Half Day School Timings) వరకు పని చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. మరోవైపు పదో తరగతి పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో ఒంటి గంట నుంచి సాయంత్రం 5 వరకు తరగతులు జరగనున్నట్లు వివరించింది.

Related Posts

Srisailam Reservoir: కృష్ణమ్మకు ఏపీ సీఎం జలహారతి.. నేడు తెరుచుకోనున్న శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు

శ్రీశైలం జలాశయాని(Srisailam Reservoir)కి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల(Heavy Rains) వల్ల కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద(flood) నీరు వచ్చి చేరుతోంది. సుంకేసుల(Sunkesula), జూరాల(Jurala) నుంచి 1,72,705 క్యూసెక్కుల నీటి ప్రవాహం…

Texas Floods: టెక్సాస్‌లో ఆకస్మిక వరదలు.. వంద మందికిపైగా మృతి

అమెరికాలోని టెక్సాస్(Texas) రాష్ట్రంలో సంభవించిన ఆకస్మిక వరదలు(Flash floods) పెను విషాదాన్ని మిగిల్చాయి. ఈ జల ప్రళయంలో మరణించిన వారి సంఖ్య 104 మంది మరణించినట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఇంకా చాలా మంది గల్లంతైన నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *