ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ.. భారత ప్లేయర్లకు ఎంతంటే?

కిక్రెట్‌లో ఓ మహా సమరం ముగిసింది. 19 రోజుల పాటు అభిమానులను అలరించిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025) టోర్నమెంట్ మార్చి 9న న్యూజిలాండ్-భారత్(NZ vs IND) మధ్య ఫైనల్‌తో ముగిసింది. తుదిపోరులో టీమ్ఇండియా 4 వికెట్ల తేడాతో కివీస్‌ను మట్టికరిపించి 12 తర్వాత మళ్లీ ఈ ట్రోఫీని ముద్దాడింది. ఈ ట్రోఫీకి ఐసీసీ భారీ మొత్తంలో ప్రైజ్ మనీ(Prize Money) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఫైనల్‌లో గెలిచి ఛాంపియన్స్‌గా నిలిచిన టీమ్ఇండియా ప్లేయర్ల పంట పండింది. ఒక్కో ప్లేయర్‌కు ఎంత దక్కతుంది. టోర్నీలోని మిగతా జట్లకు ఎంతెంత అందుతుందుంది? అనే వివరాలను ఐసీసీ తాజాగా వెల్లడించింది.

Image

ఒక్కో జట్టుకు ఎంత అందుతుందంటే..

ICC ఇప్పటికే ఛాంపియన్స్  ట్రోఫీ ప్రైజ్ మనీని ప్రకటించింది. దానీ ప్రకారం.. విజేత భారత (Winner Team India) జట్టుకు $2.24M, అంటే దాదాపు రూ.19.46 కోట్లు లభించాయి. అంటే భారత జట్టులోని ప్రతి ఆటగాడికి ఒక కోటి రూపాయలకు పైగా లభించింది. అలాగే రన్నరప్ అయిన న్యూజిలాండ్(NZ) $1.12 మిలియన్లు, అంటే దాదాపు రూ.9.73 కోట్లు అందుకుంది. సెమీఫైనల్లో ఓడిపోయిన AUS, SAకు ఒక్కొక్కటి $560,000, అంటే దాదాపు రూ.4.86 కోట్లు అందుకున్నాయి. దీంతోపాటు అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌లకు రూ.3.04 కోట్ల చొప్పున.. లీగ్ స్టేజీలో టేబుల్ చివరన నిలిచిన PAK, ENG జట్లకు రూ.1.22 కోట్ల చొప్పున దక్కింది. దీంతోపాటు ప్రతి గ్రూప్ దశ మ్యాచ్ విజయానికి ప్రైజ్ మనీ రూ.29.53 లక్షల చొప్పున ఆయా జట్లు అందుకుంటాయి.

Image

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అవార్డులు వీరికే..

☛ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్: రచిన్ రవీంద్ర (NZ)
☛ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు: రోహిత్ శర్మ(IND)
☛ గోల్డెన్ బాల్ అవార్డు: మ్యాట్ హెన్రీ(NZ)
☛ గోల్డెన్ బ్యాట్ అవార్డు: రచిన్ రవీంద్ర(NZ)

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *