ఉప్పల్​ ప్రజలు హస్తం గెలుపుకు జై

మన ఈనాడు, హైదరాబాద్​:
కాంగ్రెస్​ పార్టీ ఉప్పల్​ నియోజకవర్గంలో చాపకింద నీరులా జనంలోకి విస్తరించింది. అభ్యర్థి మందముల పరమేశ్వరరెడ్డి చేస్తున్న ప్రచారంలో ప్రజలు ప్రేమతో స్వాగతం పలుకుతున్నారు. ఆత్మీయ పలకరింపుతో ప్రజలే కాంగ్రెస్​ అభ్యర్థికి ధైర్యం నింపుతున్నారు.
ఇప్పటికే కాప్రా అధికారపార్టీ కార్పొరేటర్​ స్వర్ణరాజ్​ బీఆర్​ఎస్​ పార్టీ పోకడలు నచ్చకపోవడంతో హస్తం గూటికి చేరారు. బలమైన ఓటు బ్యాంకు ఈసారి హస్తం పార్టీకి పడుతుందని భావిస్తున్నారు. ఏఎస్​రావునగర్​ డివిజన్​లో పూర్తిగా చైతన్యవంతమైన ప్రాంతం. అక్కడి ఓటర్లు ఉన్నతవర్గాలకు చెందినవారే అధికం.కారు పార్టీ దగ్గరగానే ఉంటూనే హస్తం పార్టీ గెలుపుకు గ్రౌండ్​లో పనిచేస్తున్నారు.
ఎమ్మెల్యే బేతి ప్రధాన అనుచరులుగా ముద్రవేసుకున్న జనంపల్లి వెంకటేశ్వరరెడ్డి, గరిక సుధాకర్​ వర్గం రేవంత్​రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​ పార్టీలో చేరారు. దీంతో పది డివిజన్లలో వీరి ప్రభావం స్పష్టం కనిపిస్తుంది. న్యూట్రల్​గా ఉన్న ఓటర్లుపై దృష్టి సారించారు. ఉప్పల్​ హస్తం పవర్​ చూపించేందుకు కాంగ్రెస్ నేతలు సిద్దం అయ్యారు. గ్రేటర్​ హైదరాబాద్​లో ఉప్పల్​ ప్రజలు అధికారపార్టీకి దిమ్మతిరిగే తీర్పు ఇవ్వబోతున్నారని జనం చర్చించుకుంటున్నారు.

Share post:

లేటెస్ట్