ప్రభుత్వానికి సహకరిద్దాం.. అల్లు అర్జున్ స్పెషల్ వీడియో వైరల్

Mana Enadu : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) మాదక ద్రవ్య రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డ్రగ్స్ సరఫరా (Drugs Supply), వినియోగంపై కట్టడి మొదలు పెట్టింది. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ మాదకద్రవ్యాలు సరఫరా చేసే వారిపై ఉక్కుపాదం మోపుతోంది. మరోవైపు డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా పలువురు ప్రముఖులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

ఇందులో భాగంగానే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సినీ ప్రముఖులను డ్రగ్స్ నివారణ, కట్టడికై అవగాహన కల్పించేలా వీడియోలు రూపొందించాలని సూచించారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), జూనియర్ ఎన్టీఆర్ వంటి ప్రముఖ హీరోలు డ్రగ్స్ కట్టడి కోసం అవగాహన వీడియోలు రూపొందించారు. తాజాగా ఈ జాబితాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరాడు.

డ్రగ్స్ సరఫరా, వినియోగం కట్టడిలో తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అల్లు అర్జున్‌ (Allu Arjun) పిలుపునిచ్చాడు. మాదకద్రవ్యాలకు ఆకర్షితులై జీవితాన్ని నాశనం చేసుకుంటున్న బాధితులకు అండగా నిలవాలని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆయన ఓ వీడియో రిలీజ్ చేశాడు. డ్రగ్స్ రహిత తెలంగాణపై యాంటీ నార్కోటిక్‌ టీమ్‌ (Telangana Narcotic Team)కు సహకరిస్తూ తన వంతు బాధ్యతగా ఈ ప్రత్యేక వీడియో షేర్‌ చేశాడు.

‘‘మీకు తెలిసిన వారెవరైనా డ్రగ్స్‌ (Drug Addicts) తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో టోల్‌ ఫ్రీ నంబర్‌: 1908కు ఫోన్‌ చేయండి. వారు బాధితులను పునరావాస కేంద్రాలకు తీసుకువెళ్లి సాధారణ జీవనశైలిలోకి వచ్చే వరకూ జాగ్రత్తగా చూసుకుంటారు.  ప్రభుత్వ ఉద్దేశం వారికి సాయం చేయడం. మంచి సమాజం కోసం బాధితులకు అండగా నిలుద్దాం’’ అని వీడియోలో అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *