మన ఈనాడు:ఇవాళ ఉదయం 11 గంటలకు సెక్రెటరియేట్లో ఏపీ క్యాబినెట్ మీటింగ్ జరగనుంది. మిచాంగ్ తుఫాను వల్ల వాటిళ్లిన నష్టం, ప్రభుత్వం నుండి చేసిన సాయం, పంట నష్టం పై మంత్రివర్గం చర్చించనుంది. మిచాంగ్ తుఫాన్ బాధితులకు చెల్లించాల్సిన నష్ట పరిహారం, మౌలిక వసతుల కల్పనపై క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకోనున్నారు. అదేవిధంగా ప్రతినెల ఇచ్చే సామాజిక పింఛను 2750 రూపాయలు నుండి 3000 రూపాయలకు పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. పించను రూ. 3000 ఇస్తామన్న జగన్ హామీ జనవరి 1వ తేది నుండి అమలుకు క్యాబినెట్ ఓకే చెప్పనుంది. ఎమ్యెల్యే, ఎంపీ అభ్యర్థుల నియోజకవర్గాల మార్పు, మంత్రులకుసైతం స్థాన చలనం, మరికొందరు మంత్రులకు, ఎమ్యెల్యేలకు స్థాన చలనంచేసే అంశంపై మంత్రులతో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉంది.
నా రాజీనామాతో వారికే లబ్ధి : విజయసాయి రెడ్డి
వైఎస్సార్సీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి (Vijaysai Reddy) రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజ్యసభ సభ్యత్వానికి…
ప్రజల్లో జగన్పై నమ్మకం పోయింది.. అందుకే విజయసాయి రాజీనామా: Sharmila
YCP సీనియర్ నేత, రాజ్యసభ MP విజయసాయి రెడ్డి(Vijaya Sai Reddy) ఇవాళ తన పదవికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా(Resignation) సమర్పించిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజీనామాపై APCC నేత వైఎస్ షర్మిల(YS Sharmila) స్పందించారు. మాజీ సీఎం, YCP…