
భారత్(India)- పాకిస్థాన్(Pakistan) మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్న వేళ అమెరికా(America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రంగంలోకి దిగారు. ఈ మేరకు శనివారం సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయని తెలిపారు. స్వయంగా తామే రెండు దేశాలకు మధ్యవర్తిత్వం వహించామని.. తమ ప్రతిపాదనను రెండు దేశాలు గౌరవించాయని పేర్కొన్నారు. తక్షణ సీజ్ఫైర్కు ఇరు దేశాలు అంగీకరించాయని పేర్కొన్నారు. దీంతో రెండు దేశాలకు ట్రంప్ అభినందనలు తెలిపారు.
Breaking: Donald Trump says India, Pakistan have agreed to FULL AND IMMEDIATE CEASEFIRE #ceasefire #CeasefireNow #IndianArmy #DonaldTrump pic.twitter.com/9hy0zAXWut
— News_tak (@biggbossog_7) May 10, 2025
ట్రంప్ పోస్ట్ చేసిన కాసేపటికే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో సైతం ఇదే తరహా ప్రకటన చేశారు. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. భారత్, పాక్ ప్రధానులు నరేంద్రమోదీ, షెహబాజ్ షరీఫ్, భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసిమ్ మునీర్, ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ డోభాల్, అసిమ్ మాలిక్లతో మాట్లాడినట్లు చెప్పారు.
మే 12న ఇరు దేశాల మధ్య చర్చలు: మిస్రీ
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధంపై విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ కీలక ప్రకటన చేశారు. 2 దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం జరిగిందని, ఈరోజు సా.5 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చిందన్నారు. ఇరుదేశాల మధ్య గగన, సముద్ర, భూభాగంపై మిలిటరీ ఆపరేషన్స్ నిలిపివేశామన్నారు. అటు ఈ నెల 12న పాక్తో శాంతి చర్చలు జరుపుతామని తెలిపారు.
Foreign Secretary Vikram Misri:
Pakistan’s DGMO spoke with India’s DGMO at 3:35 PM. Both sides agreed to halt all firing across land, sea, and air.
Ceasefire effective from 5 PM today.
Next round of talks scheduled for 12 PM on May 12. pic.twitter.com/VDNPUiRos0— Gagandeep Singh (@Gagan4344) May 10, 2025